Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెరువు కట్టపై బర్త్‌డే పార్టీ.. నలుగురు డిప్లొమా విద్యార్థుల మృతి.. ఎలా?

Webdunia
గురువారం, 28 ఫిబ్రవరి 2019 (15:31 IST)
నలుగురు డిప్లొమా విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. చెరువు కట్టపై బర్త్‌డే పార్టీ చేసుకునేందుకు వెళ్లి చనిపోయారు. ఈ విషాదకర సంఘటన తెలంగాణ రాష్ట్రంలోని కోదాడలో బుధవారం జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కోదాడ పట్టణంలోని ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలో డిప్లొమా మొదటి సంవత్సరం చదువుతున్న చక్రాల ప్రవీణ్ తన పుట్టిన రోజు సందర్భంగా 15 మంది స్నేహితులతో కలిసి కోదాడలోని పెద్ద చెరువు కట్టమీద గల గుడి వద్ద చేసుకున్నారు. 
 
వారంతా కలిసి పార్టీ చేసుకున్నారు. ఆ తర్వాత సమీర్ అనే యువకుడు చేతులు కడుక్కునేందుకు చెరువులోకి దిగి నీటి వద్దకు వెళ్లాడు. అపుడు ప్రమాదవశాత్తు పట్టుకోల్పోయి చెరువులో పడిపోయాడు. అతన్ని రక్షించే క్రమంలో మరో ఇద్దరు చెరువులోకి దిగారు. 
 
లోతు ఎక్కు వగా ఉండడంతో చక్రాల ప్రవీణ్(18), హుజూర్ నగర్‌కు చెందిన భవాని ప్రసాద్ (17), నేరేడుచర్లకు చెందిన సమీర్ (17), ఖమ్మం జిల్లా పైనంపల్లికి చెందిన మహీందర్ (17) మృతిచెందారు. ఈ సంఘటనతో భయపడిన మిగిలిన స్టూడెంట్స్​ అక్కడి నుంచి పరారయ్యారు.
 
విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని చెరువులో నుంచి నలుగురి తదేహాలను వెలికితీశారు. తల్లిదండ్రుల రోదనతో ఆ ప్రాంతం మొత్తం విషాదం అలముకుంది. పుట్టినరోజు నాడే ప్రవీణ్ మృతిచెందడం తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments