Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్రామస్థులు మాట్లాడటం లేదనీ... ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి!

Webdunia
గురువారం, 13 మే 2021 (09:41 IST)
కరోనా సోకిందన్న అనుమానంతో గ్రామస్థులంతా తనతో మాట్లాడకపోవడంతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాదకర ఘటన తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం జైకేసారంలో గ్రామంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ గ్రామానికి చెందిన 38 యేళ్ల ఓ వ్యక్తి భార్య, పదేళ్ల కుమారుడికి పది రోజుల క్రితం కరోనా సోకింది. ఆయనకు కూడా లక్షణాలు ఉండటంతో రెండుసార్లు పరీక్ష చేయించుకోగా నెగెటివ్‌ వచ్చింది. 
 
అయితే, గ్రామస్థులు మాత్రం.. ఆయనకు కూడా కరోనా సోకిందనే అనుమానంతో స్థానికులు ఎవరూ మాట్లాడటం మానేశారు. మంగళవారం రాత్రి తీవ్రమైన దగ్గు, ఆయాసం రావడంతో జీవితంపై విరక్తి చెంది బుధవారం తెల్లవారుజామున బయటకు వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి బయలుదేరాడు. 
 
వ్యవసాయ బావి వద్ద చెట్టుకు ఉరేసుకున్నాడు. స్థానికులు గమనించి చౌటుప్పల్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. వైద్యులు కరోనా పరీక్ష చేయగా పాజిటివ్‌ వచ్చింది. మృతుడు లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. భార్య, కుమారుడు ప్రస్తుతం హోం ఐసొలేషన్‌లో ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments