Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్ బహిరంగ లేఖ.. అవన్నీ అబద్ధాలే

Webdunia
శుక్రవారం, 18 ఫిబ్రవరి 2022 (14:15 IST)
తెలంగాణ సీఎం కేసీఆర్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లేఖ రాశారు ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణ సీఎం కేసీఆర్ రాసిన లేఖ అబద్ధాలతో కూరుకుపోయిందని చెప్పారు. ఆ లేఖ ప్రజలను తప్పుదోవ పట్టించేలా వుందని సంజయ్ ఫైర్ అయ్యారు. 
 
సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాల వల్ల అనుసరిస్తున్న విధానాల వల్ల సంతోషంగా సంక్రాంతి పండుగను చేసుకోవాల్సిన రైతులు, నిరుద్యోగులు, ఉద్యోగ, ఉపాధ్యాయులు నేడు కన్నీళ్ళతో సకినాల పిండిని తడుపుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని బండి సంజయ్ పేర్కొన్నారు. 
 
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని నిరుద్యోగుల పక్షాన మహోద్యమానికి శ్రీకారం చుట్టామని బండి సంజయ్ పేర్కొన్నారు. 
 
రాష్ట్రంలో బిజెపి చేస్తున్న ఉద్యమం ద్వారా ప్రజల్లో ఆలోచన రేకెత్తిస్తున్న తరుణంలో సీఎం కేసీఆర్ కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాసి ప్రజల మైండ్ డైవర్ట్ చేశాడని, తద్వారా కొత్త డ్రామాకు తెరతీశారు అని బండి సంజయ్ బహిరంగ లేఖ ద్వారా పేర్కొన్నారు. 
 
ఏప్రిల్ 13న ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర రైతాంగానికి ఉచితంగా ఎరువులను సరఫరా చేయాలని బండి సంజయ్ సీఎం కేసీఆర్ ను డిమాండ్ చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు లక్ష రూపాయల రుణమాఫీని పూర్తిగా అమలు చేయాలన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అర్జున్ కపూర్‌తో బ్రేకప్.. సంగక్కర పక్కనే కూర్చున్న మలైకా అరోరా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments