Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్ బహిరంగ లేఖ.. అవన్నీ అబద్ధాలే

Webdunia
శుక్రవారం, 18 ఫిబ్రవరి 2022 (14:15 IST)
తెలంగాణ సీఎం కేసీఆర్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లేఖ రాశారు ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణ సీఎం కేసీఆర్ రాసిన లేఖ అబద్ధాలతో కూరుకుపోయిందని చెప్పారు. ఆ లేఖ ప్రజలను తప్పుదోవ పట్టించేలా వుందని సంజయ్ ఫైర్ అయ్యారు. 
 
సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాల వల్ల అనుసరిస్తున్న విధానాల వల్ల సంతోషంగా సంక్రాంతి పండుగను చేసుకోవాల్సిన రైతులు, నిరుద్యోగులు, ఉద్యోగ, ఉపాధ్యాయులు నేడు కన్నీళ్ళతో సకినాల పిండిని తడుపుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని బండి సంజయ్ పేర్కొన్నారు. 
 
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని నిరుద్యోగుల పక్షాన మహోద్యమానికి శ్రీకారం చుట్టామని బండి సంజయ్ పేర్కొన్నారు. 
 
రాష్ట్రంలో బిజెపి చేస్తున్న ఉద్యమం ద్వారా ప్రజల్లో ఆలోచన రేకెత్తిస్తున్న తరుణంలో సీఎం కేసీఆర్ కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాసి ప్రజల మైండ్ డైవర్ట్ చేశాడని, తద్వారా కొత్త డ్రామాకు తెరతీశారు అని బండి సంజయ్ బహిరంగ లేఖ ద్వారా పేర్కొన్నారు. 
 
ఏప్రిల్ 13న ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర రైతాంగానికి ఉచితంగా ఎరువులను సరఫరా చేయాలని బండి సంజయ్ సీఎం కేసీఆర్ ను డిమాండ్ చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు లక్ష రూపాయల రుణమాఫీని పూర్తిగా అమలు చేయాలన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను OG అంటే మీరు క్యాజీ అంటే నేనేం చేయాలి: పవన్ కల్యాణ్ (video)

35-చిన్న కథ కాదు'- మనందరి కథ : హీరో రానా దగ్గుబాటి

సుహాస్ హీరోగా కోర్టు డ్రామా జనక అయితే గనక.. ఫస్ట్ లుక్

పేక మేడలు సినిమా నుంచి సెకండ్ సింగిల్ ఆడపిల్ల .. విడుదల

వెంకటేష్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, ఎక్స్ లెంట్ వైఫ్ పాత్రల చుట్టూ తిరిగే కథే వెంకీ మూవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

తర్వాతి కథనం
Show comments