కొన్ని అధ్యాయాలు అంతే.. ముగింపు దశకు రాకముందే ముగిసిపోతాయి : బండి సంజయ్

Webdunia
మంగళవారం, 4 జులై 2023 (19:31 IST)
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి నుంచి బండి సంజన్‌ను తప్పించారు. ఆయన స్థానంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడిగా బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా నియమించారు. దీంతో బండి సంజయ్ మంగళవారమే తన అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఈ సందర్భంగా ఆయన తీవ్ర భావోద్వేగంతో కూడిన ట్వీట్ చేశారు. "కొన్ని అధ్యాయాలు ముంగిపు దశకు చేరుకోకముందే ముగిసిపోతుంటాయి" అంటూ పేర్కొన్నారు. తన పదవీకాలంలో పొరబాటున ఎవరినైనా బాధించివుంటే, తనను క్షమించాలని, వారి ఆశీస్సులు అందించాలని కోరారు. 
 
పైగా, తన పదవీకాలంలో విచారించదగ్గ ఘటనలేవీ లేకపోవడం సంతోషదాయకమన్నారు. అందరూ కూడా మర్చిపోలేని మధురానుభూతులు అందించారని తెలిపారు. అరెస్టుల సమయంలో, దాడులకు గురైన సమయంలో, ఉల్లాసంగా ఉన్న సమయంలో కూడా తనకు వెన్నంటి నిలిచారని వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నట్టు చెప్పారు. 
 
"నేను ఎప్పటికీ కార్యకర్తల్లో ఒకడినే. ఇకపైనా కార్యకర్తగానే ఉంటా. తెలంగాణ కొత్త బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డితో కలిసి పనిచేస్తా. పార్టీ అభ్యున్నతి కోసం ఆయనతో కలిసి నవ్యోత్సవంతో కృషి చేస్తాను" అని ఆయన మరో ప్రకటనలో పేర్కొన్నారు. తనలాంటి సాధారణ కార్యకర్తు పెద్ద అవకాశం ఇచ్చారంటూ ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, పార్టీ అగ్రనేతలు బీఎల్ సంతోష్, శివప్రకాశ్, సునీల్ బన్సల్, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అర్వింద్ మీనన్, తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ తరుణ్ చుగ్‌‍లకు కృతజ్ఞతలు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments