పెళ్లికి నిరాకరించిందన్న కోపంతో యువతిపై దాడి

Webdunia
బుధవారం, 10 నవంబరు 2021 (22:05 IST)
ఎల్బీనగర్‌ పీఎస్‌ పరిధిలో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. యువతిపై బస్వరాజు అనే యువకుడు కత్తితో దాడి చేశాడు.

హస్తినాపురంలోని యువతి ఇంట్లోకి ప్రవేశించి దాడి చేశాడు. ప్రేమించి పెళ్లికి నిరాకరించిందన్న కోపంతో బస్వరాజు దాడికి పాల్పడ్డాడు.

శిరీష పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించారు. నిందితుడు బస్వరాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

నిందితుడు బస్వరాజు, బాధితురాలు వికారాబాద్ జిల్లా దౌలతాబాద్ మండలానికి చెందినవారిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అయితే వేరే వివాహం చేసుకుంటున్నానని బస్వరాజు తనపై దాడి చేసినట్లు బాధితురాలు తెలిపారు.

తనకు వివాహం ఫిక్స్ అయిందని, ఫోన్ చేయకని తాను చెప్పినా వినలేదని ఆమె చెప్పారు. గతంలో తాము ఇద్దరం ప్రేమించుకున్నామని బాధితురాలు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా ఇంటి బంగారం కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌: ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సమంత

పెద్ది రామ్‌చరణ్ బాడీగార్డుకి రోజుకి రూ. 2 లక్షల జీతం, అదిరిపోతున్న టాలీవుడ్

Trisha: ఇప్పట్లో ఎన్నికల్లో పోటీ చేయకూడదనుకుంటున్న త్రిష? ఎందుకో తెలుసా?

అనన్య పాండేకు ఆన్‌లైన్ ట్రోలింగ్.. అది భరత నాట్యమేనా? (video)

Ananth Sriramఫ మా తల్లిదండ్రులను కాపాడండి: అనంత్ శ్రీరామ్

తర్వాతి కథనం
Show comments