ఏటీఎంలో రూ.1000 డ్రా చేస్తే రూ.2000 నగదు... పోటెత్తిన జనం

Webdunia
మంగళవారం, 25 అక్టోబరు 2022 (18:17 IST)
తెలంగాణ రాష్ట్రంలోని సిద్ధిపేటలో ఓ ఏటీఎం కేంద్రంలో రూ.1000 డ్రా చేస్తే రూ.2000 నగదు వచ్చింది. ఈ విషయం క్షణాల్లో ఊరంతా పాకిపోయింది. దీంతో స్థానికులు ఈ ఏటీఎం కేంద్రంలో డబ్బులు డ్రా చేసేందుకు ఎగబడ్డారు. ఏటీఎం సెంటరు వద్ద భారీ క్యూ చేరిపోయింది. ఈ ఏటీఎం బ్యాంక్ ఆఫ్ బరోడాకు చెందినది. ఈ విషయం తెలిసిన వెంటనే అగమేఘాలపై అక్కడకు చేరుకున్న బ్యాంకు అధికారులు ఏటీఎం సెంటరును మూసివేశారు. 
 
బ్యాంకు ఆఫ్ బరోడాకు చెందిన ఏటీఎం కేంద్రంలో రూ.వెయ్యి డ్రా చేస్తే రూ.2 వేల నగదు వస్తుందన్న వార్త ఆ ప్రాంతమంతా క్షణాల్లో వ్యాపించింది. దీంతో ఏ ఏటీఎం వద్దకు ప్రజలు భారీగా తరలివచ్చారు. డబ్బులు డ్రా చేసేందుకు పోటీపడ్డారు. ఏటీఎంలో పెద్ద మొత్తంలో నగదు బయటకు వస్తుందన్న నేపథ్యంలో బ్యాంకు అధికారులకు సమాచారం అందింది. 
 
ఆ వెంటనే స్పందించిన అధికారులు ఆ ఏటీఎంను మూసివేశారు. సాంకేతిక సమస్య కారణంగానే ఆ ఏటీఎం నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు బయటకు వచ్చాయని అధికారులు అంటున్నారు. దీంతో ఏటీఎంను మూసివేసి తనిఖీ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జూమ్ కాల్‌లో బోరున విలపించిన యాంకర్ అనసూయ

బాక్సాఫీస్ వద్ద 'మన శంకరవరప్రసాద్ గారు' దూకుడు

ఒక వర్గానికి చెందిన అభిమానులు పరాశక్తిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు : దర్శకురాలు సుధా కొంగరా

Anasuya: పోలీసులను ఆశ్రయించిన అనసూయ.. 42 మందిపై ఫిర్యాదు.. ఎందుకో తెలుసా?

మన శంకర వర ప్రసాద్ గారులో రాసిన ప్రతి సీన్‌కి ఇన్స్పిరేషన్ చిరంజీవి గారే : అనిల్ రావిపూడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సరే, మీరు పిల్లల్ని పంపడంలేదుగా, మే జారుతాం: జర్రున జారుతున్న కోతులు (video)

అద్భుతమైన కళాత్మక వస్త్రశ్రేణితో ఈ సంక్రాంతి సంబరాలను జరుపుకోండి

దక్షిణ భారతదేశంలో విస్తరిస్తున్న గో కలర్స్, హైదరాబాద్‌ ఏఎస్ రావు నగర్‌లో కొత్త స్టోర్ ప్రారంభం

ఏ ఆహారం తింటే ఎముకలు పటిష్టంగా మారుతాయి?

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో తమ కార్యకలాపాలను ప్రారంభించిన వీక్యురా రీస్కల్ప్ట్

తర్వాతి కథనం
Show comments