ఏటీఎంలో రూ.1000 డ్రా చేస్తే రూ.2000 నగదు... పోటెత్తిన జనం

Webdunia
మంగళవారం, 25 అక్టోబరు 2022 (18:17 IST)
తెలంగాణ రాష్ట్రంలోని సిద్ధిపేటలో ఓ ఏటీఎం కేంద్రంలో రూ.1000 డ్రా చేస్తే రూ.2000 నగదు వచ్చింది. ఈ విషయం క్షణాల్లో ఊరంతా పాకిపోయింది. దీంతో స్థానికులు ఈ ఏటీఎం కేంద్రంలో డబ్బులు డ్రా చేసేందుకు ఎగబడ్డారు. ఏటీఎం సెంటరు వద్ద భారీ క్యూ చేరిపోయింది. ఈ ఏటీఎం బ్యాంక్ ఆఫ్ బరోడాకు చెందినది. ఈ విషయం తెలిసిన వెంటనే అగమేఘాలపై అక్కడకు చేరుకున్న బ్యాంకు అధికారులు ఏటీఎం సెంటరును మూసివేశారు. 
 
బ్యాంకు ఆఫ్ బరోడాకు చెందిన ఏటీఎం కేంద్రంలో రూ.వెయ్యి డ్రా చేస్తే రూ.2 వేల నగదు వస్తుందన్న వార్త ఆ ప్రాంతమంతా క్షణాల్లో వ్యాపించింది. దీంతో ఏ ఏటీఎం వద్దకు ప్రజలు భారీగా తరలివచ్చారు. డబ్బులు డ్రా చేసేందుకు పోటీపడ్డారు. ఏటీఎంలో పెద్ద మొత్తంలో నగదు బయటకు వస్తుందన్న నేపథ్యంలో బ్యాంకు అధికారులకు సమాచారం అందింది. 
 
ఆ వెంటనే స్పందించిన అధికారులు ఆ ఏటీఎంను మూసివేశారు. సాంకేతిక సమస్య కారణంగానే ఆ ఏటీఎం నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు బయటకు వచ్చాయని అధికారులు అంటున్నారు. దీంతో ఏటీఎంను మూసివేసి తనిఖీ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గాడిదలా నటించాలని ఆ దర్శకుడు కోరితే ఏమాత్రం ఆలోచించను : హీరో ఆర్య

Ramcharan: తన తండ్రి చిరంజీవిని తన ఆదర్శ హీరోగా పేర్కొన్న రామ్ చరణ్

అమ్మాయిలను వేధించే వారికి శిక్షలు ఉండాలని చెప్పే ఓ అందాల రాక్షసి

The Big Picture: దేశవ్యాప్తం గా తొలి రియాలిటీ షో బిగ్ పిచ్చర్ ప్రారంభం

Naga Chaitanya: INCA అవార్డ్స్ 2026లో తాండెల్ చిత్రానికి ఉత్తమ నటుడిగా నాగ చైతన్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విక్టోరియా సీక్రెట్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్‌గా తృప్తి దిమ్రీని ప్రకటించిన అప్పారెల్ గ్రూప్

కాలేయ వ్యాధి క్లెయిమ్‌లు పెరుగుతున్నాయి, చికిత్స ఖర్చులు అధికమవుతున్నాయి: కేర్ హెల్త్ ఇన్సూరెన్స్

భరించలేని సయాటికా నొప్పి తగ్గేందుకు ఇంటి చిట్కాలు

మెడికవర్ హాస్పిటల్స్‌లో అరుదైన ఘనత: అత్యంత క్లిష్టమైన గుండె, భారీ కణితి శస్త్రచికిత్సలు విజయవంతం

భారతదేశంలో విల్లెరట్ యొక్క గోల్డెన్ హవర్ కలెక్షన్‌ను ఆవిష్కరించిన బ్లాంక్ పెయిన్

తర్వాతి కథనం
Show comments