Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాలిబన్లతో కేంద్రం చర్చలు జరపాలి.. పోయేదేముంది..?: అసదుద్దీన్ ఒవైసీ

Webdunia
మంగళవారం, 17 ఆగస్టు 2021 (22:36 IST)
తాలిబన్లను భారత్ గుర్తించినా గుర్తించకపోయినా వారితో చర్చలు జరపాలని ఏఐఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. తాలిబన్లతో చర్చలు జరపాలని అంతర్జాతీయ భద్రతా నిపుణులంతా కూడా చెబుతున్నారని అన్నారు. వరుస ట్వీట్లలోనూ, ఆ తర్వాత విలేఖరులతో మాట్లాడుతూ ఆయన ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 
 
దేశ వ్యూహాత్మక ప్రయోజనాల పరిరక్షణకు తాలిబన్లతో దౌత్యపరమైన మార్గాలను తెరిచి ఉంచాలని 2013లోనే తాను సలహా ఇచ్చానని, అయితే తన సలహాను ఖాతరు చేయలేదని, పైగా విమర్శించారని ఒవైసీ అన్నారు.
 
2019లో అప్ఘనిస్థాన్‌కు సంబంధించిన వాస్తవాలపై నా ఆందోళన తెలియజేశాను. పాకిస్తాన్, అమెరికా, తాలిబన్లు మాస్కోలో చర్చలు జరుపుతుంటే, ట్రంప్‌ను ఆయన ఎన్నిసార్లు హగ్ చేసుకున్నారో పీఎంఓ ఇండియా లెక్కలు వేస్తూ వచ్చింది. ప్రభుత్వ ఆప్ఘనిస్థాన్ విధానం ఏమిటో ఇప్పటికీ మనకు తెలియడం లేదు అని ఒవైసీ ట్వీట్ చేశారు. 
 
భారతదేశం 3 బిలియన్ డాలర్లు ఆప్ఘనిస్థాన్‌లో పెట్టుబడులు పెట్టిందని, ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందని ఓవైసీ ప్రశ్నించారు. షరామామూలుగానే మోదీ ప్రభుత్వం సంక్షోభం తలుపుతట్టినప్పుడు నాటకీయత మొదలుపెడుతుందని ఒవైసీ విమర్శించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Srileela: వధువులా దుస్తులు ధరించిన శ్రీలీల.. బుగ్గలకు పసుపు రాసుకుంది.. పెళ్లి ఖాయమా?

Surya: కాలిఫోర్నియాలో దియా పట్టా కోసం కనిపించిన న్యూ లుక్ తో సూర్య

Singer Aditi : దండోరా మూవీతో నటిగా ఎంట్రీ ఇస్తోన్న సింగ‌ర్ అదితి భావ‌రాజు

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ

Rashmika: విజయ్ దేవరకొండ ఇంట్లో ఫోటో షూట్ చేసిన రష్మిక- ఆ చీరను ఎవరిచ్చారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments