Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌కే మా మద్దతు : ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ

Webdunia
సోమవారం, 16 అక్టోబరు 2023 (16:40 IST)
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ భారసా అధినేత, సీఎం కేసీఆర్‌కే మద్దతు ఇస్తామని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రకటించారు. పేదల కోసం సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చారని ఆయన వ్యాఖ్యానించారు. అందువల్ల కేసీఆర్‌కు తమ పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. 
 
ఇదే అంశంపై ఆయన సోమవారం హైదరాబాద్ నగరంలో మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌కు తమ పార్టీ నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పదేళ్లకాలంలో పేదల కోసం ఎన్నో పథకాలు తీసుకువచ్చారని కితాబిచ్చారు. ముఖ్యమంత్రి విడుదల చేసిన మేనిఫెస్టో అద్భుతంగా ఉందని, ఆయన హ్యాట్రిక్ ముఖ్యమంత్రి కావడం తథ్యమని చెప్పారు.
 
తెలంగాణాలో బీఆర్ఎస్ - ఎంఐఎం పార్టీల మధ్య దోస్తీ మొదటి నుంచి కొనసాగుతుందన్నారు. మస్జిల్ తమ మిత్రపక్షమని కేసీఆర్ పలుమార్లు చెప్పారు. అసదుద్దీన్ ఇటీవల కూడా మాట్లాడుతూ, రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సుఖశాంతుల కోసం సీఎం కేసీఆర్‌ను మళ్లీ గెలిపించాలన్నారు. బీజేపీ, కాంగ్రెస్ దొందూ దొందేనని అన్నారు. తాము తెలంగాణాలో పాటు రాజస్థాన్ ఎన్నికల్లోనూ పలు స్థానాల్లో పోటీ చేస్తామని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

35వ వార్షికోత్సవంలో అక్కినేని నాగార్జున, రామ్ గోపాల్ వర్మ ల శివ

జెండా ఒక ఖడ్గం అనే ఉద్దేశ్యం తో తీశా : ఖడ్గం రీ రిలీజ్ సందర్భంగా కృష్ణవంశీ

రాజేంద్ర ప్రసాద్ గారికి ప్రగాఢ సానుభూతి తెలిపిన పవన్ కళ్యాణ్, ఎన్.టి.ఆర్.

రాజేంద్రప్రసాద్ కూతురు మృతి.. గుండెపోటుతో 38 ఏళ్లకే తిరిగిరాని లోకాలకు...

కొరటాల శివలో మనశ్శాంతి చూస్తున్నా : దేవర సక్సెస్ మీట్ లో ఎన్.టి.ఆర్.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు తగ్గించే తులసి టీ, ఇంకా ఏమేమి ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments