Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాఠశాలల్లో పెరుగుతున్న కోవిడ్ కేసులు.. స్కూల్‌లోనే ఐసోలేషన్‌

Webdunia
గురువారం, 18 మార్చి 2021 (13:27 IST)
తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. పాఠశాలల్లో కోవిడ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. అనేక మంది విద్యార్థులు, టీచర్స్ కరోనా బారిన పడుతున్నారు. దీంతో ప్రభుత్వం కూడా తరగతుల నిర్వహణపై పునరాలో చేస్తున్నట్టు స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలోనే చెప్పారు. పాఠశాలల్లో కరోనా కేసులు పెరగడం ఆందోళన వ్యక్తం చేశారు. 
 
తాజాగా హైదరాబాద్ నాగోల్ జెడ్పీ ఉన్నత పాఠశాల హెడ్ మాస్టర్‌కు కరోనా పాజిటివ్ రావడంతో స్కూల్‌ను మూసివేశారు. తోటి ఉపాధ్యాయులకు వైద్య అధికారులు కరోనా పరీక్షలు చేస్తున్నారు. బుధవారం నాగోల్‌లోని మైనార్టీ బాలికల రెసిడెన్షియల్‌ స్కూల్‌లో 38 విద్యార్ధులకు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో తల్లిదండ్రులు, విద్యార్థులు భయాందోళనకు గురతున్నారు. అప్రమత్తమైన అధికారులు కోవిడ్‌ టెస్టింగ్‌ సెంటర్‌లను ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం 184 మంది విద్యార్ధినులకు పరీక్షలు చేయగా.. 38 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది.
 
మిగితావారికి అధికారులు ర్యాపిడ్ పరీక్షలు చేస్తున్నారు. అయితే కరోనా సోకిన 38 విద్యార్ధులకు ఎలాంటి లక్షణాలు లేవన్నారు. టెస్టుల్లో నెగెటివ్‌ వచ్చిన విద్యార్ధులను ఇళ్లకు పంపేందుకు యాజమాన్యం ఏర్పాట్లు చేస్తోంది. పాజిటివ్‌ వచ్చిన వారికి స్కూల్‌లోనే ఐసోలేషన్‌లో చికిత్స అందిస్తామని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

Lavanya Tripathi: పెండ్లిచేసుకున్న భర్తను సతీ లీలావతి ఎందుకు కొడుతోంది ?

మళ్లీ వార్తల్లో నిలిచిన సినీ నటి కల్పిక.. సిగరెట్స్ ఏది రా.. అంటూ గొడవ (video)

Cooli: నటీనటులతో రజనీకాంత్ కూలీ ట్రైలర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్

ANirudh: మనసులో భయం మరోపక్క మంచి సినిమా అనే ధైర్యం : విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments