Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుదుచ్చేరి మాజీ ముఖ్యమంత్రికి షాకిచ్చిన కాంగ్రెస్

Webdunia
గురువారం, 18 మార్చి 2021 (13:21 IST)
పుదుచ్చేరి మాజీ సీఎం నారాయణస్వామికి కాంగ్రెస్‌ పార్టీ షాకిచ్చింది. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పోటీ చేయడం లేదని పార్టీ స్పష్టం చేసింది. ఈ మేరకు ఏఐసీసీ ఇన్‌ఛార్జి దినేశ్‌ గుండురావ్‌ ఓ ప్రకటనలో వెల్లడించారు. 
 
ఏప్రిల్ 6న జరుగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేయబోయే 14 మంది అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలోనూ నారాయణస్వామి పేరును పార్టీ ప్రకటించకపోవడం గమనార్హం. 
 
 
 
‘మాజీ సీఎం నారాయణస్వామి 2021 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. పార్టీ తరపున ప్రచారం, ఎన్నికల నిర్వహణ బాధ్యతలను ఆయన చూసుకుంటారు’ అని దినేశ్‌ వెల్లడించారు. ప్రస్తుతం ప్రకటించిన 14 మందిలో కీలక అభ్యర్థులు సెల్వనదనె(కర్దిర్‌గామమ్), ఎం కన్నన్(ఇందిరానగర్‌)‌, కార్తీకేయన్‌(ఒస్సుదు) ఉన్నారు. 
 
పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంలోని 30 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్‌ 6న ఎన్నికలు జరగనున్నాయి. కాగా, పుదుచ్చేరిలో నారాయణస్వామి నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఐదేళ్ల గడువు ముగియకముందే గతనెలలో పడిపోయిన విషయం తెలిసిందే. 
 
అధికార పార్టీలోని కొందరు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో.. అసెంబ్లీలో కాంగ్రెస్‌ సంఖ్యా బలం తగ్గి ప్రభుత్వం పడిపోయింది. నారాయణస్వామి అసెంబ్లీలో బలం నిరూపించుకోవడంలో విఫలమవడంతో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో విశాల్‌తో అభినయ ప్రేమలో వుందా? అసలు విషయం ఏంటో తెలుసా?

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ మూడో షెడ్యూల్ పూర్తి

బాలీవుడ్‌కు మరో ఆప్షన్ లేదు... దక్షిణాది నటీనటులు అవసరం కావాలి : రెజీనా

డాకు మహారాజ్ ఫ్లాప్ - నిర్మాత నాగ వంశీ పై ట్రోలింగ్

ఇంట్లో నా పరువు కాపాడండి చైతన్య అక్కినేని వేడుకోలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

జలుబు, దగ్గుకి అల్లంతో పెరటి వైద్యం

టీలు, కాఫీలకు బదులు ఈ జావ తాగరాదూ?

86 ఏళ్ల వృద్ధుడిలో మింగే రుగ్మతను విజయవంతంగా పరిష్కరించిన విజయవాడ మణిపాల్ హాస్పిటల్

శీతాకాలం సీజనల్ వ్యాధులను అడ్డుకునే ఆహారం ఏమిటి?

తర్వాతి కథనం
Show comments