Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీ ఎంపీ ఆత్మహత్య.. అమిత్ షా సంతాపం... కీలక సమావేశం రద్దు

Webdunia
గురువారం, 18 మార్చి 2021 (13:13 IST)
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన చెందిన బీజేపీ ఎంపీ మండి రామ్ స్వరూప్ శర్మ ఢిల్లీలోని తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రి సమీపంలోని గోమతీ అపార్ట్‌మెంట్‌లో సీలింగ్ ఫ్యాన్‌కి వేలాడుతూ ఈయన మృతదేహం కనబడింది. ఈయన ఆత్మహత్యకు కారణాలు తెలియలేదు. 
 
ఓ ఉద్యోగి నుంచి తమకు ఫోన్ కాల్ అందిందని, వెళ్లి చూస్తే డోర్ లోపలి నుంచి వేసి ఉందని పోలీసులు తెలిపారు. హిమాచల్ ప్రదేశ్‌లోని మండి ప్రాంతానికి చెందిన ఈ ఎంపీ మృతిపట్ల హోం మంత్రి అమిత్ షా తన ట్విటరులో తీవ్ర సంతాపం తెలిపారు. 
 
రామ్ స్వరూప్ శర్మకు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. మండి జిల్లాలోని జల్ పెహర్ గ్రామంలో 1958 లో జన్మించిన ఈయన రెండు సార్లు ఎంపీగా ఉన్నారు. 
 
2014లో, ఆ తర్వాత 2019 లో ఈయన లోక్‌సభకు ఎన్నికయ్యారు. విదేశీ వ్యవహారాలపై ఉన్న స్టాండింగ్ కమిటీలోను, ఈ శాఖ కన్సల్టేటివ్ కమిటీలో కూడా శర్మ సభ్యుడిగా ఉన్నారు. ఈయన మృతికి సంతాప సూచనగా బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని రద్దు చేశారు. 
 
ఈ సమావేశం గురువారం ఉదయం జరగాల్సి ఉంది. శర్మ ఎందుకు సూసైడ్ చేసుకున్నారన్న విషయం స్పష్టం కాలేదు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

కరణ్ అన్షుమాన్ క్రియేట్ చేసిన రానా నాయుడు 2 వచ్చేస్తుంది

ANR: మళ్ళీ తెరమీద 68 సంవత్సరాల మాయాబజార్ రీరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments