ఢిల్లీ లిక్కర్ స్కామ్ : అరబిందో ఫార్మా‌కు చెందిన డైరెక్టర్ అరెస్టు

Webdunia
శుక్రవారం, 11 నవంబరు 2022 (09:19 IST)
దేశ రాజధాని ఢిల్లీ నగరంలో వెలుగు చూసిన లిక్కర్ స్కామ్‌లో అరబిందో ఫార్మా డైరెక్టరు శరత్ చంద్రారెడ్డిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గురువారం అరెస్టు చేసింది. అలాగే, మరో వ్యక్తి వినయ్ బాబుని కూడా అరెస్టు చేసింది. వీరివద్ద వరుసగా మూడు రోజుల పాటు విచారణ జరిపిన తర్వాత అరెస్టు చేసినట్టు ప్రకటించింది. వీరిద్దరూ తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే కావడం గమనార్హం. అయితే, శరత్‌శ్చంద్రా రెడ్డి అరబిందో ఫార్మాలో 12వ డైరెక్టరుగా ఉండటం గమనార్హం. 
 
ఈ కేసులో లోతుగా దర్యాప్తు చేస్తున్న ఈడీ.. వీరిద్దరి వద్ద గత మూడు రోజులుగా విచారణ జరుపుతోంద. విచారణ ముగిసిన వెంటనే అరెస్టు చేస్తున్నట్టు ప్రకటించింది. మరోవైపు, ఈ అరెస్టులపై ఈడీ స్పందిస్తూ, వీరిద్దరికీ కోట్లాది రూపాయల వెలువైన మద్యం వ్యాపారాలు ఉన్నాయని తెలిపింది. 
 
ఢిల్లీ లిక్కర్ పాలసీకి అనుగుణంగా ఈఎండీలు చెల్లించినట్టు శరత్‌శ్చంద్రారెడ్డిపై అభియోగాలు ఉన్నాయని పేర్కొంది. ఈడీ తాజా అరెస్టులు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా కలకలం రేపాయి. మున్ముందు ఇంకెన్ని, ఇంకెంత మంది అరెస్టు అవుతారో అనే చర్చ మొదలైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సైబర్ క్రైమ్ పోలీసులను మళ్లీ ఆశ్రయించిన చిరంజీవి

Rajamouli : బాహుబలి ఎపిక్ తో రాజమౌళి అందరికీ మరో బాట వేస్తున్నారా !

Peddi: రామ్ చరణ్, జాన్వీ పై కేరళ లోని రైల్వే టనల్ దగ్గర పెద్ది షూటింగ్

సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న సూపర్ స్టార్ రజనీకాంత్?

China Peace : స్పై డ్రామా చైనా పీస్ నుంచి ఇదేంటో జేమ్స్ బాండ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments