Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా నాన్న ఆరోగ్యం సీరియస్‌గా ఉంది... ఎంపీ ధర్మపురి అరవింద్

Webdunia
సోమవారం, 27 ఫిబ్రవరి 2023 (14:40 IST)
తన తండ్రి, ఉమ్మడి ఏపీ మాజీ పీసీసీ చీఫ్ ధర్మపురి శ్రీనివాస్ ఆరోగ్యం విషమంగా ఉందని ఆయన కుమారుడు, నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ వెల్లడించారు. ఇదే విషయంపై ఆయన సోమవారం ఓ ట్వీట్ చేశారు. 
 
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడిగా, మంత్రిగా పనిచేసిన ధర్మపురి శ్రీనివాస్ సోమవారం తీవ్ర అస్వస్థతకు లోనై హైదరాబాద్ బంజార హిల్స్‌లోని న్యూరో సిటీ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఎమ్మారై స్కాన్ తదితర పరీక్షలను చేస్తున్నారు. ఈ వైద్య పరీక్షలన్నీ పూర్తయిన తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ఒక మీడియా బులిటెన్ విడుదల చేయనున్నారు. 
 
దీనిపై ధర్మపురి అరవింద్ స్పందించారు. తన తండ్రి ఆరోగ్యం క్రిటికల్‌గా ఉందని పేర్కొన్నారు. ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారని చెప్పారు. అందువల్ల ఈ రోజు రేపు తన అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకున్నట్టు తెలిపారు. ఈ మేరకు ఆయన కార్యకర్తలను ఉద్దేశించి ట్వీట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments