తెలంగాణాలో మరో మంకీపాక్స్ కేసు గుర్తింపు

Webdunia
బుధవారం, 27 జులై 2022 (08:54 IST)
తెలంగాణ రాష్ట్రంలో మరో మంకీపాక్స్ కేసు వెలుగు చూసింది. ఖమ్మంలో ఈ కేసును గుర్తించారు. దీంతో జిల్లా వాసుల్లో ఆందోళనలు నెలకొన్నాయి. వైద్య వర్గాల మేరకు ఆరముంపుల ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి స్థానికంగా ఉండే గ్రానైట్ కంపెనీలు పని చేస్తున్నాడు. ఈయన గత మూడు రోజుల క్రితం అస్వస్థతకు గురయ్యాడు. దీంతో ఖమ్మంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స కోసం చేరాడు. ఆ తర్వాత అతని శరీరంపై బొబ్బలు రావడాన్ని వైద్యులు గుర్తించారు. ఆ వెంటనే ఆ వ్యక్తిని ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 
 
గత మూడు రోజులుగా తీవ్ర జ్వరం, శరీరంపై దద్దుర్లు రావడంతో ఖమ్మం ప్రభుత్వాసుపత్రి వైద్యులు మంకీపాక్స్‌ వైరస్‌గా ప్రాథమికంగా ఓ నిర్థారణకు వచ్చి అక్కడ నుంచి హైదరాబాద్ నగరంలోని ఫీవర్ ఆస్పత్రికి తరలించారు. అలాగే, అతనితో సన్నిహితంగా ఉన్న వారిని గుర్తించే పనిలో జిల్లా వైద్యాధికారులు నిమగ్నమయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత తల్లి కాబోతుందా.. బేబీ బంప్‌తో కనిపించిన మా ఇంటి బంగారం? (video)

Klin Kaara: క్లిన్ కారాతో హ్యాపీగా కనిపించిన ఉపాసన, రామ్ చరణ్

Allu Arjun Court: అల్లు అర్జున్ తప్పనిసరిగా హాజరు కావాలన్న నాంపల్లి కోర్టు

Vishal : మకుటం నుంచి విశాల్ పాడిన రైజ్ ఆఫ్ లింగా పాట

నాగబంధం ఛేదించి అనంత పద్మనాభ స్వామి ఆలయంలో ప్రవేశించారా?

తర్వాతి కథనం
Show comments