తెలంగాణలో మరో ఉద్యమం మొదలైంది: రేవంత్ రెడ్డి

Webdunia
సోమవారం, 4 నవంబరు 2019 (06:48 IST)
రాచరికం రోజుల్లో కూడా ఇంతటి నియంతను ప్రజలు చూసి ఉండరని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ లాంటి అహంకారిని తెలంగాణ సమాజం ఎక్కువ కాలం భరించదని తెలిపారు.

16 మంది కార్మికులు చనిపోతే.. మానవత్వం లేకుండా మాట్లాడి మృతుల కుటుంబాలను అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి. సీఎం మాటల్లో అడుగడుగునా అహంకారం కొట్టొచ్చినట్టు కనిపించిందని మండిపడ్డారు.

16 మంది కార్మికులు చనిపోతే.. మానవత్వం లేకుండా మాట్లాడి మృతుల కుటుంబాలను అవమానించారని విమర్శించారు. ఆత్మహత్యలు చేసుకోకుండా ధైర్యం చెప్పే ప్రయత్నంకాని, సమస్య పరిష్కరించే చిత్తశుద్ధికాని కనిపించలేదని స్పష్టం చేశారు.

రాచరికం రోజుల్లో కూడా ఇంతటి నియంతను ప్రజలు చూసి ఉండరని రేవంత్​ పేర్కొన్నారు. కేసీఆర్ లాంటి అహంకారిని తెలంగాణ సమాజం ఎక్కువ కాలం భరించలేదని అన్నారు.

ఇప్పటికే హద్దుదాటి ముఖ్యమంత్రి దుర్మార్గాన్ని సమాజం భరించిందని... ఇక ఒక్క క్షణం కూడా కేసీఆర్‌ను భరించే స్థితిలో ప్రజలు లేరన్నారు. సీఎం పోకడలకు వ్యతిరేకంగా రాష్ట్రంలో మరో ఉద్యమం తీవ్ర రూపంలో మొదలు కావాల్సిన సమయం వచ్చిందన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sai Pallavi: పూజా హెగ్డేకు బ్యాడ్ లక్.. సాయిపల్లవికి ఆ ఛాన్స్..

Prabhas: ప్రభాస్ రాజా సాబ్ నుంచి ఫస్ట్ సాంగ్ అప్డేట్

వీధికుక్కలు దేశంలో ఎవరిని కరిచినా నన్నే నిందిస్తున్నారు : అక్కినేని అమల

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments