Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో మరో ఉద్యమం మొదలైంది: రేవంత్ రెడ్డి

Webdunia
సోమవారం, 4 నవంబరు 2019 (06:48 IST)
రాచరికం రోజుల్లో కూడా ఇంతటి నియంతను ప్రజలు చూసి ఉండరని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ లాంటి అహంకారిని తెలంగాణ సమాజం ఎక్కువ కాలం భరించదని తెలిపారు.

16 మంది కార్మికులు చనిపోతే.. మానవత్వం లేకుండా మాట్లాడి మృతుల కుటుంబాలను అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి. సీఎం మాటల్లో అడుగడుగునా అహంకారం కొట్టొచ్చినట్టు కనిపించిందని మండిపడ్డారు.

16 మంది కార్మికులు చనిపోతే.. మానవత్వం లేకుండా మాట్లాడి మృతుల కుటుంబాలను అవమానించారని విమర్శించారు. ఆత్మహత్యలు చేసుకోకుండా ధైర్యం చెప్పే ప్రయత్నంకాని, సమస్య పరిష్కరించే చిత్తశుద్ధికాని కనిపించలేదని స్పష్టం చేశారు.

రాచరికం రోజుల్లో కూడా ఇంతటి నియంతను ప్రజలు చూసి ఉండరని రేవంత్​ పేర్కొన్నారు. కేసీఆర్ లాంటి అహంకారిని తెలంగాణ సమాజం ఎక్కువ కాలం భరించలేదని అన్నారు.

ఇప్పటికే హద్దుదాటి ముఖ్యమంత్రి దుర్మార్గాన్ని సమాజం భరించిందని... ఇక ఒక్క క్షణం కూడా కేసీఆర్‌ను భరించే స్థితిలో ప్రజలు లేరన్నారు. సీఎం పోకడలకు వ్యతిరేకంగా రాష్ట్రంలో మరో ఉద్యమం తీవ్ర రూపంలో మొదలు కావాల్సిన సమయం వచ్చిందన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అన్నం పెట్టిన సినీ పరిశ్రమకు, నిర్మాతకు అండగా వుండేదుకే వచ్చా : పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించే అవకాశం దక్కటం నా అదృష్టం.. నిధి అగర్వాల్

నేను యాక్సిడెంటల్ హీరోను... చిరంజీవి తమ్ముడైనా టాలెంట్ లేకుంటే వేస్ట్ : పవన్ కళ్యాణ్

హిరణ్య కశ్యప గా రానా, విజయ్ సేతుపతి ఓకే, కానీ నరసింహ పాత్ర ఎవరూ చేయలేరు : డైరెక్టర్ అశ్విన్ కుమార్

ఇంట్లో విజయ్ దేవరకొండ - కింగ్ డమ్ తో తగలబెడదానికి సిద్ధం !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments