Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్నూలు జిల్లాలో మరో దిశ తరహా ఘటన.. పెట్రోల్ పోసి నిప్పంటించారు..

Webdunia
శుక్రవారం, 23 ఏప్రియల్ 2021 (10:28 IST)
కర్నూలు జిల్లాలో మరో దిశ తరహా ఘటన చోటుచేసుకుంది. బాలికపై డీజిల్ పోసి దుండగులు నిప్పంటించారు. బనగానపల్లె యాగంటిపల్లెలో బాలిక అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. తెలంగాణలోని నారాయణపేట జిల్లా మరికల్‌ మండలం రాకొండకు చెందిన కొందరు జీఎన్‌ఎస్‌ఎస్‌ ప్రధాన కాల్వ లైనింగ్‌ పనుల కోసం వచ్చారు. బాలిక (టి.అనూష-15) తండ్రి ఉదయం పనులు చేసేందుకు వెళ్లాడు. ఆ పక్కనే ఉన్న తాత్కాలిక షెడ్ల దగ్గర కుమార్తె ఉంది. 
 
సాయంత్రం ఇంటికి వచ్చిన తండ్ర.. షెడ్‌ పక్కన కుమార్తె మంటల్లో కాలిపోయి ఉండటాన్ని గమనించాడు. పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకుని సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బనగానపల్లెకు తరలించి, తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 
 
బాలికపై ఎవరైనా లైంగికదాడికి పాల్పడిన అనంతరం డీజల్‌ పోసి నిప్పటించి హత్య చేశారా.. బాలిక ఆత్మహత్య చేసుకుందా అనే వివరాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. బాలికపై అత్యాచారం జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమె తండ్రిని కూడా ప్రశ్నిస్తున్నారు.. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments