Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికాలో తుపాకీ మిస్ ఫైర్... తెలంగాణ విద్యార్థి మృతి

Webdunia
మంగళవారం, 7 ఫిబ్రవరి 2023 (14:12 IST)
అమెరికా దేశంలో జరిగిన ఓ విషాదకర ఘటనలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన విద్యార్థి ఒకరు చనిపోయారు. తుపాకీ మిస్ ఫైర్ కావడంతో ఆయన ఖమ్మం జిల్లాకు చెందిన విద్యార్థి ప్రాణాలు విడిచారు. 
 
ఈ జిల్లాలోని మధిర పట్టణానికి చెందిన మహంకాళి అఖిల్‌సాయి అనే విద్యార్థి ఎంఎస్‌ చదివేందుకు 13 నెలల క్రితం అమెరికా వెళ్లాడు. అలబామాలోని అబర్న్‌ యూనివర్సిటీలో చదువుతున్నాడు. అలాగే, తన ప్యాకెట్ మనీ కోసం సమీపంలోని ఓ గ్యాస్‌ స్టేషన్‌లో పార్ట్‌టైమ్‌ జాబ్‌ కూడా చేస్తున్నాడు. 
 
ఈ నేపథ్యంలో అమెరికా కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 10 గంటల సమయంలో గ్యాస్‌స్టేషన్‌లోని సెక్యూరిటీ గార్డు వద్ద తుపాకీని పరిశీలిస్తున్న క్రమంలో అది మిస్‌ ఫైర్‌ అయింది. అందులోని బుల్లెట్ ఒకటి బయటకు దూసుకొచ్చి అఖిల్‌ సాయి తలలోకి దూసుకెళ్లింది. 
 
దీంతో ఇతర సిబ్బంది హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అఖిల్‌ మృతిచెందాడు. అఖిల్‌ సాయి మృతిపై కుటుంబసభ్యులకు సమాచారం అందింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments