Webdunia - Bharat's app for daily news and videos

Install App

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు క్యూకట్టిన ప్రయాణికులు

Webdunia
సోమవారం, 1 జూన్ 2020 (15:28 IST)
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు ప్రయాణికులు క్యూ కట్టారు. లాక్డౌన్ ఆంక్షల సడలింపుతో దేశ వ్యాప్తంగా 200 రైలు సర్వీసులను నడిపేందుకు రైల్వే శాఖ ఏర్పాట్లు చేసింది. ఇందులోభాగంగా, తెలుగు రాష్ట్రాల నుంచి 9 రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి. 
 
జూన్ ఒకటో తేదీ సోమవారం ఉదయం ఆరు గంటలకు నాంపల్లి నుంచి తెలంగాణ ఎక్స్‌ప్రెస్ ఢిల్లీకి బయలుదేరింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు పెద్ద సంఖ్యలో ప్రయాణికులు చేరుకోవడంతో భారీ క్యూలైన్‌ ఏర్పడింది. 
 
ప్రయాణికులంతా రైలు బయలుదేరే సమయానికి 90-120 నిమిషాల ముందే రావాలని సూచించడంతో పెద్దసంఖ్యలో ప్రయాణికులు తెల్లవారుజాము నుంచే రైల్వే స్టేషన్‌కి చేరుకున్నారు. వారంతా సామాజిక భౌతికదూరం పాటిస్తూ వరుస లైన్లలో నిల్చొన్నారు. వీరందరికీ వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత రైలు ఎక్కేందుకు అనుమతినిచ్చారు.
 
కాగా, దేశవ్యాప్తంగా 100 రూట్లలో 200 ప్రత్యేక రైళ్లను రైల్వే శాఖ నడుపుతుంది. తొలి రోజు లక్షా 45 వేల మంది ప్రయాణాలు చేయనున్నారు. ఆన్‌లైన్, రైల్వే బుకింగ్ కౌంటర్లలో రిజర్వేషన్‌కు అవకాశం కల్పించారు. థర్మల్ స్క్రీనింగ్ తర్వాత టికెట్ ఉన్న వారికే స్టేషన్‌లోకి అనుమతిస్తారు. ప్రతి ప్రయాణికుడు తప్పని సరిగా మాస్క్ ధరించాలని నిబంధన విధించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments