Webdunia - Bharat's app for daily news and videos

Install App

తూగో కరోనా దూకుడు ... ఒక్క జిల్లాలోనే 219 ... ఓ గ్రామంలో 113 కేసులు

Webdunia
సోమవారం, 1 జూన్ 2020 (14:15 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లాలో ఇప్పటివరకు ఏకంగా 219 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా, జిల్లాలోని పెదపూడి మండలంలోని గొల్లాల మామిడాడ అనే గ్రామంలో 113 మంది కరోనా పాజిటివ్ రోగులు ఉన్నారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నిజానికి తూర్పు గోదావరి జిల్లాలో సరిగ్గా పది రోజుల క్రితం మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కేవలం 62 మాత్రమే. ఆ తర్వాత ఇంటింటి సర్వే చేపట్టడంతో ఈ కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది. 
 
ముఖ్యంగా, జి. మామిడాడ గ్రామంలో 5 వేల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, ఇందులో 120 మందికి పాజిటివ్ రిజల్ట్స్ వచ్చిందని తెలిపారు. ప్రస్తుతం ఈ గ్రామంలో 113 కేసులు ఉన్నట్టు తెలిపారు. దీంతో గ్రామంలో హైఅలెర్ట్ ప్రకటించారు. పైగా, లాక్డౌన్ ఆంక్షలను పోలీసులు మరింత కఠినతరం చేశారు. 
 
ఇదే అంశంపై అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ, ఇంటింటి సర్వే చేపట్టడంతో ఈ కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిందని తెలిపారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 219 పాజిటివ్ కేసులు ఉన్నట్టు ఆయన తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhil Akkineni: జైనాబ్ రావ్జీతో అఖిల్ అక్కినేని వివాహం.. ఫోటోలు, వీడియో క్లిప్‌లు వైరల్

రోడ్డు ప్రమాదంలో 'దసరా' మూవీ విలన్ తండ్రి దుర్మరణం

రూ.21 కోట్లు వడ్డీతో చెల్లించండి.. విశాల్‌కు హైకోర్టు ఆదేశం

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments