Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుండెపోటుతో ప్రియుడు మరణం, వివాహిత మహిళను చావబాదారు

Webdunia
శుక్రవారం, 22 మే 2020 (23:08 IST)
వివాహేతర సంబంధమే ఆ మహిళ పాలిట శాపంగా మారి మృత్యవాత పడింది. ఆ గ్రామంలో సదరు మహిళ మృతి రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. వివరాల్లోకి వెళితే, ఖమ్మం జిల్లా మధిర అనంతసాగర్‌లో వేల్పుల వినోద రావు కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన రాంబాయి(వివాహిత)తో  వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.
 
సంబంధం సజావుగా సాగేందుకు కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు ఇరువురు మకాం మార్చారు. అప్పుడప్పుడూ స్వగ్రామం వచ్చి వెళుతుండేవారు. కరోనా నేపధ్యంలో ఇద్దరు స్వగ్రామం చేరుకుని ఎవరిళ్ళలో వాళ్ళు ఉంటున్నారు. గత వారం రోజుల క్రితం వినోద రావు గుండెపోటుతో మృతి చెందాడు. మృతునికి అక్రమ సంబంధమే కారణం అయిందంటూ బంధువులు రాంబాయిను చితకబాదారు.
 
ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో రాంబాయి బంధువులు వినోదరావు ఇంటి ఎదుట ధర్నా నిర్వహించారు. రాంబాయి మృతికి కారకులైన వారిని అరెస్టు చేయాలని, వినోదరావుకు సంబంధించిన ఆస్తిపాస్తుల రాంబాయి పిల్లల పేర్లు రాయించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏపీ సీఎం చంద్రబాబుకు బహుమతి ఇచ్చిన పూనమ్ కౌర్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments