Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుండెపోటుతో ప్రియుడు మరణం, వివాహిత మహిళను చావబాదారు

Webdunia
శుక్రవారం, 22 మే 2020 (23:08 IST)
వివాహేతర సంబంధమే ఆ మహిళ పాలిట శాపంగా మారి మృత్యవాత పడింది. ఆ గ్రామంలో సదరు మహిళ మృతి రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. వివరాల్లోకి వెళితే, ఖమ్మం జిల్లా మధిర అనంతసాగర్‌లో వేల్పుల వినోద రావు కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన రాంబాయి(వివాహిత)తో  వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.
 
సంబంధం సజావుగా సాగేందుకు కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు ఇరువురు మకాం మార్చారు. అప్పుడప్పుడూ స్వగ్రామం వచ్చి వెళుతుండేవారు. కరోనా నేపధ్యంలో ఇద్దరు స్వగ్రామం చేరుకుని ఎవరిళ్ళలో వాళ్ళు ఉంటున్నారు. గత వారం రోజుల క్రితం వినోద రావు గుండెపోటుతో మృతి చెందాడు. మృతునికి అక్రమ సంబంధమే కారణం అయిందంటూ బంధువులు రాంబాయిను చితకబాదారు.
 
ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో రాంబాయి బంధువులు వినోదరావు ఇంటి ఎదుట ధర్నా నిర్వహించారు. రాంబాయి మృతికి కారకులైన వారిని అరెస్టు చేయాలని, వినోదరావుకు సంబంధించిన ఆస్తిపాస్తుల రాంబాయి పిల్లల పేర్లు రాయించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

UK-chiru: నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ - యునైటెడ్ కింగ్‌డమ్‌లో మెగాస్టార్ చిరంజీవి

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

Varma: ఏపీలో శారీ సినిమాకు థియేటర్స్ దొరకవు అనుకోవడం లేదు - రామ్ గోపాల్ వర్మ

జాక్ - కొంచెం క్రాక్ గా వుంటాడు, నవ్విస్తాడు : సిద్ధు జొన్నలగడ్డ

లైసెన్స్ ఉన్న బెట్టింగ్ యాప్‌‍లకే విజయ్ దేవరకొండ ప్రచారం చేశారట...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments