కాంగ్రెస్ పార్టీ జోడో యాత్ర.. రాహుల్‌తో కలిసి అడుగులేసిన పూనమ్ కౌర్!

Webdunia
శనివారం, 29 అక్టోబరు 2022 (19:34 IST)
Poonam Kaur_Rahul Gandhi
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ జోడో యాత్ర కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ ఆధ్యర్వంలో ఆ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన జోడో యాత్ర శనివారం మహబూబ్‌ నగర్ జిల్లాలో కొనసాగుతోంది. 
 
తెలంగాణ రాష్ట్రంలో నాల్గవ రోజు యాత్రలో భాగంగా రాహుల్ వెంట కాంగ్రెస్ శ్రేణులు, స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ యాత్రకు సినిమా హీరోయిన్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. 
 
రాహుల్ గాంధీ పాదయాత్రలో శనివారం ఉదయం సినీ హీరోయిన్ పూనమ్ కౌర్ పాల్గొన్నారు. రాహుల్ వెంట నడుస్తూ పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. 
 
అనంతరం పూనమ్ కౌర్ మాట్లాడుతూ.. చేనేత కార్మికుల సమస్యలపై రాహుల్‌తో చర్చించానని, రాహుల్ సమస్యలను బాగా అధ్యయనం చేస్తున్నారని పూనమ్ కౌర్ వెల్లడించారు. 
 
అంతేకాక చేనేతలు ఎదుర్కొంటున్న సమస్యలపై పార్లమెంట్‌లో ప్రస్తావించాలని రాహుల్ గాంధీని కోరినట్లు పూనమ్ కౌర్ తెలిపింది. అయితే సినిమాలకు ప్రస్తుతం దూరంగా వుంటున్న పూనమ్ కౌర్.. వున్నట్టుండి రాహుల్ గాంధీ పాదయాత్రలో ప్రత్యక్షం కావటం చర్చనీయాంశంగా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Preity Zinta: ఆభరణాలు జీవితంలో అమూల్యమైన క్షణాలంటున్న ప్రీతి జి జింటా

Tilak Verma : ఆసియా కప్ హీరో క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి

K-ర్యాంప్ ట్రైలర్ తో డీజే మిక్స్ యూత్ కు రీచ్ చేస్తున్న కిరణ్ అబ్బవరం

Chiru: మన శంకర వర ప్రసాద్ గారు...మీసాల పిల్ల.. 17 మిలియన్‌+ వ్యూస్ సాధించింది

World Health Summit 2025 : తొలి భారతీయ నటిగా కృతి సనన్ గుర్తింపు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments