Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాషాయం కండువా కప్పుకోనున్న సినీ నటి జయసుధ

Webdunia
బుధవారం, 2 ఆగస్టు 2023 (14:56 IST)
సీనియర్ సినీ నటి జయసుధ బీజేపీలో చేరనున్నారు. ఇందుకోసం ఆమె బుధవారం ఢిల్లీకి వెళ్లారు. సాయంత్రం ఆమె కాషాయం కండువా కప్పుకోనున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో జరిగే ఈ కార్యక్రమానికి బీజేపీ తెలంగాణ చీఫ్ కిషన్ రెడ్డి, సీనియర్ నేతలు బండి సంజయ్, లక్ష్మణ్‌లు హాజరుకానున్నారు. గత 2009 సంవత్సరంలో సికింద్రాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి ఆమె కాంగ్రెస్ పార్టీ టిక్కెట్‌పై గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టిన విషయం తెల్సిందే. ఆ తర్వాత ఆమె క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు. 
 
ఇపుడు మళ్లీ బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. బుధవారం సాయంత్రం ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆమె బీజేపీ ప్రాథమిక సభ్యత్వాన్ని స్వీకరించనున్నారు. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఇప్పటికే తెంలగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఎంపీలు లక్ష్మణ్, బండి సంజయ్ తదితరులు ఢిల్లీలోనే ఉన్నారు. వీరంతా ఈ కార్యక్రమానికి హాజరువుతున్నారు. అయితే, బీజేపీలో చేరే జయసుధ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి త్వరలో జరిగే ఎన్నికల్లో ముషిరాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. అయితే, ఆమెకు పార్టీ నాయకత్వం టిక్కెట్ ఇస్తుందా లేదా అన్నది వేచిచూడాల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఘోరాలు, సాధువులు, నాగ సాధువులకు ప్రదర్శించిన కన్నప్ప చిత్రం

హ్రుతిక్ రోషన్ ఎమోషన్ భావాలతో వార్ 2 కేక్ కటింగ్ తో షూటింగ్ పూర్తి

Siddharth: నేను కూడా లైఫ్ ని రెండుసార్లు రీసెట్ చేశాను : హీరో సిద్ధార్థ్

న్యూ టాలెంట్ కు సపోర్ట్ గా నిలుస్తున్న హీరో కిరణ్ అబ్బవరం

Upasana: నా భర్తకి అయ్యప్ప స్వామి, నాకు సాయి బాబా పట్ల విశ్వాసం : ఉపాసనా కామినేని కొణిదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments