Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాషాయం కండువా కప్పుకోనున్న సినీ నటి జయసుధ

Webdunia
బుధవారం, 2 ఆగస్టు 2023 (14:56 IST)
సీనియర్ సినీ నటి జయసుధ బీజేపీలో చేరనున్నారు. ఇందుకోసం ఆమె బుధవారం ఢిల్లీకి వెళ్లారు. సాయంత్రం ఆమె కాషాయం కండువా కప్పుకోనున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో జరిగే ఈ కార్యక్రమానికి బీజేపీ తెలంగాణ చీఫ్ కిషన్ రెడ్డి, సీనియర్ నేతలు బండి సంజయ్, లక్ష్మణ్‌లు హాజరుకానున్నారు. గత 2009 సంవత్సరంలో సికింద్రాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి ఆమె కాంగ్రెస్ పార్టీ టిక్కెట్‌పై గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టిన విషయం తెల్సిందే. ఆ తర్వాత ఆమె క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు. 
 
ఇపుడు మళ్లీ బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. బుధవారం సాయంత్రం ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆమె బీజేపీ ప్రాథమిక సభ్యత్వాన్ని స్వీకరించనున్నారు. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఇప్పటికే తెంలగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఎంపీలు లక్ష్మణ్, బండి సంజయ్ తదితరులు ఢిల్లీలోనే ఉన్నారు. వీరంతా ఈ కార్యక్రమానికి హాజరువుతున్నారు. అయితే, బీజేపీలో చేరే జయసుధ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి త్వరలో జరిగే ఎన్నికల్లో ముషిరాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. అయితే, ఆమెకు పార్టీ నాయకత్వం టిక్కెట్ ఇస్తుందా లేదా అన్నది వేచిచూడాల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments