కాషాయం కండువా కప్పుకోనున్న సినీ నటి జయసుధ

Webdunia
బుధవారం, 2 ఆగస్టు 2023 (14:56 IST)
సీనియర్ సినీ నటి జయసుధ బీజేపీలో చేరనున్నారు. ఇందుకోసం ఆమె బుధవారం ఢిల్లీకి వెళ్లారు. సాయంత్రం ఆమె కాషాయం కండువా కప్పుకోనున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో జరిగే ఈ కార్యక్రమానికి బీజేపీ తెలంగాణ చీఫ్ కిషన్ రెడ్డి, సీనియర్ నేతలు బండి సంజయ్, లక్ష్మణ్‌లు హాజరుకానున్నారు. గత 2009 సంవత్సరంలో సికింద్రాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి ఆమె కాంగ్రెస్ పార్టీ టిక్కెట్‌పై గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టిన విషయం తెల్సిందే. ఆ తర్వాత ఆమె క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు. 
 
ఇపుడు మళ్లీ బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. బుధవారం సాయంత్రం ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆమె బీజేపీ ప్రాథమిక సభ్యత్వాన్ని స్వీకరించనున్నారు. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఇప్పటికే తెంలగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఎంపీలు లక్ష్మణ్, బండి సంజయ్ తదితరులు ఢిల్లీలోనే ఉన్నారు. వీరంతా ఈ కార్యక్రమానికి హాజరువుతున్నారు. అయితే, బీజేపీలో చేరే జయసుధ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి త్వరలో జరిగే ఎన్నికల్లో ముషిరాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. అయితే, ఆమెకు పార్టీ నాయకత్వం టిక్కెట్ ఇస్తుందా లేదా అన్నది వేచిచూడాల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tilak Varma: రామ్ చరణ్ పెద్ది సెట్స్‌ను సందర్శించిన టీ20 ప్రపంచ కప్ స్టార్ తిలక్ వర్మ

Koti: మహిళలలో ఆత్మవిశ్వాసాన్ని పెంచేలా మిస్ ఇన్ఫినిటీ ఆఫ్ ఇండియా : కోటి

కన్నడ అర్థం కాదు... ట్రాన్స్‌లేట్ చేసినపుడు అసభ్యంగా ఉన్నట్టు అనిపించలేదు : నోరా ఫతేహీ

Ranveer Singh: ధురంధర్ 2 ఎందుకు వాయిదా పడిందో తెలుసా?

Mohan Babu: స్వర్గం నరకం నుంచి ప్యారడైజ్ స్థాయికి చేరుకున్న డా.మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సాహస యాత్రలపై నాట్స్ అవగాహన సదస్సు

షి ద ఛేంజ్ 2026: హైదరాబాద్‌కు చెందిన శ్రీదేవి జాస్తికి స్విగ్గీ వారు సన్మానం

వేసవిలో పెరుగు, మజ్జిగ: ప్రయోజనాలు ఏమిటి?

భవిష్యత్ ఆరోగ్య సంరక్షణ కోసం సైన్స్-పరిశోధనలను ముందుకు తీసుకెళ్లాలి: డాక్టర్ అంజిరెడ్డి స్మారక ఉపన్యాసం

శరీర బరువు పెరిగితే వచ్చే వ్యాధులు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments