Webdunia - Bharat's app for daily news and videos

Install App

అతడికి బాబాయే పెట్టుబడి, బొలేరో వాహనంతో ఢీకొట్టి చంపాడు, ఆపై...

Webdunia
శుక్రవారం, 14 ఫిబ్రవరి 2020 (17:07 IST)
డబ్బు కోసం గడ్డి తినేవారు ఈ లోకంలో కొదవేమీ లేదనేందుకు ఎన్నో ఉదంతాలు మన కళ్ల ముందు కనబడుతూనే వున్నాయి. మానవీయ విలువలకు పాతరేసి రక్త సంబంధీకులను సైతం పచ్చ నోట్ల కోసం పొట్టనబెట్టుకుంటున్న సంఘటనలు ఎన్నో. అలాంటి దారుణం తెలంగాణలోని సూర్యాపేటలో జరిగింది.
 
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం... సూర్యాపేట పరిధిలోని తాడ్వాయికి చెందిన సైదులు గత నెల 24న వాహనం ఢీకొట్టిన ఘటనలో ప్రాణాలు కోల్పోయాడు. దీనితో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఐతే మృతుడి పేరుపై రూ. 50 లక్షల బీమా వుందని తెలిసి పోలీసులు అనుమానపడ్డారు.
 
పైగా ఒంటరిగా జీవిస్తున్న సైదులకి ఇంత పెద్దమొత్తంలో బీమా ఎవరు చేయించారన్న కోణంలో దర్యాప్తు చేయగా షాకింగ్ విషయం తెలిసింది. అదేమిటంటే... మృతుడి అన్న కుమారుడు రమేష్ తన బాబాయికి ఇంత పెద్ద మొత్తంలో బీమా చేయించినట్లు తేలింది. ఐతే రమేష్ ఇటీవలే ఫైనాన్స్ కింద నాలుగు లారీలు కొనుగోలు చేశాడు. 
 
కానీ లాభాలు అంతగా రాకపోవడంతో ఫైనాన్షియర్ల నుంచి తీవ్రమైన ఒత్తిడి రావడం మొదలైంది. ఇది భరించలేని రమేష్.. బాబాయికి బీమా చేయించి, ఆపై తన స్నేహితులతో కలిసి గత నెల 24న బొలేరో వాహనంతో ఢీకొట్టి చంపేశాడు. ఆ తర్వాత అది రోడ్డు ప్రమాదంలా చిత్రీకరించి బీమా సొమ్ము కాజేసేందుకు ప్లాన్ వేశాడు. కానీ, పోలీసుల దర్యాప్తులో వాస్తవం బయటపడటంతో ఊచలు లెక్కిస్తున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హిట్ అండ్ రన్ కేసులో సినీ నటి గౌతమి కశ్యప్ అరెస్టు

Powerstar: పవర్‌స్టార్‌ను అరెస్ట్ చేశారు.. బడా మోసం.. రుణం ఇప్పిస్తానని కోట్లు గుంజేశాడు..

క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చూసి నవ్వుకున్నారు : విజయ్ సేతుపతి

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments