Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయ్యో... ఇంట్లో దీపం పెట్టే ఇల్లాలు అగ్నికి సజీవ దగ్ధమైంది...

Webdunia
మంగళవారం, 15 మార్చి 2022 (20:11 IST)
పగలంతా వళ్లంతా అలసిపోయేట్లు పనిచేసి హాయిగా సేదతీరారు ఆ దంపతులు తమ కుమారిడితో సహా. ఐతే అర్థరాత్రి వున్నట్లుండి వారిపైకి అగ్నికీలలు వచ్చిపడ్డాయి. నిద్రలేచి తేరుకునేలోపే ఇంట్లో దీపం పెట్టే ఇల్లాలు అగ్నికి ఆహుతైంది.

 
పూర్తి వివరాలు చూస్తే... తెలంగాణలోని మెదక్ జిల్లా తిమ్మాపూర్ గ్రామంలో నర్సింహులు అతడి భార్య మంగమ్మ, వారి కొడుకు నివాసం వుంటున్నారు. నిన్న రాత్రి అంతా ఇంట్లో నిద్రపోతున్నారు. అర్థరాత్రి దాటాక ఇంట్లో కరెంట్ షార్ట్ సర్క్యూట్ అయ్యింది. పూరిల్లు కావడంతో ఇంటిని క్షణాల్లో అగ్ని చుట్టుముట్టింది.

 
ఏం జరిగిందో తెలుసుకునేలోపే వారిని మంటలు చుట్టుముట్టాయి. హాహాకారాలు విని పొరుగుంటి వారు వచ్చి వారిని కాపాడే ప్రయత్నం చేసారు. నర్సింహులు, అతడి కుమారుడిని ఎలాగో బయటకు లాగారు కానీ నర్సింహులు భార్య మంగమ్మను మాత్రం కాపాడలేకపోయారు. ఆమె మంటల్లో చిక్కుకుని సజీవంగా దహనమైంది. దీంతో ఆ గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudheer: కృష్ణ కు నివాళితో జటాధర చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప్రారంభించిన సుధీర్ బాబు

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments