Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయ్యో... ఇంట్లో దీపం పెట్టే ఇల్లాలు అగ్నికి సజీవ దగ్ధమైంది...

Webdunia
మంగళవారం, 15 మార్చి 2022 (20:11 IST)
పగలంతా వళ్లంతా అలసిపోయేట్లు పనిచేసి హాయిగా సేదతీరారు ఆ దంపతులు తమ కుమారిడితో సహా. ఐతే అర్థరాత్రి వున్నట్లుండి వారిపైకి అగ్నికీలలు వచ్చిపడ్డాయి. నిద్రలేచి తేరుకునేలోపే ఇంట్లో దీపం పెట్టే ఇల్లాలు అగ్నికి ఆహుతైంది.

 
పూర్తి వివరాలు చూస్తే... తెలంగాణలోని మెదక్ జిల్లా తిమ్మాపూర్ గ్రామంలో నర్సింహులు అతడి భార్య మంగమ్మ, వారి కొడుకు నివాసం వుంటున్నారు. నిన్న రాత్రి అంతా ఇంట్లో నిద్రపోతున్నారు. అర్థరాత్రి దాటాక ఇంట్లో కరెంట్ షార్ట్ సర్క్యూట్ అయ్యింది. పూరిల్లు కావడంతో ఇంటిని క్షణాల్లో అగ్ని చుట్టుముట్టింది.

 
ఏం జరిగిందో తెలుసుకునేలోపే వారిని మంటలు చుట్టుముట్టాయి. హాహాకారాలు విని పొరుగుంటి వారు వచ్చి వారిని కాపాడే ప్రయత్నం చేసారు. నర్సింహులు, అతడి కుమారుడిని ఎలాగో బయటకు లాగారు కానీ నర్సింహులు భార్య మంగమ్మను మాత్రం కాపాడలేకపోయారు. ఆమె మంటల్లో చిక్కుకుని సజీవంగా దహనమైంది. దీంతో ఆ గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

ఓటు వేసేందుకు బయటికి రాని ప్రభాస్.. ట్రోల్స్ మొదలు..!

సిల్క్ సారీ సాంగ్ రిలీజ్ చేసిన సాయి రాజేష్

మా కాంబినేషన్ చూపులు కలిసిన శుభవేళ అనుకోవచ్చు : రాజ్ తరుణ్

అమ్మాయిలు షీ సేఫ్ యాప్‌తో సేఫ్‌గా ఉండాలి: కాజల్ అగర్వాల్

తల్లిదండ్రులు పిల్లలకు చూపించాల్సిన చిత్రం ప్రేమించొద్దు : చిత్రయూనిట్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments