Webdunia - Bharat's app for daily news and videos

Install App

గర్భిణిని బంధించి రెండు రోజులు అత్యాచారం, ఎక్కడ?

Webdunia
బుధవారం, 26 ఆగస్టు 2020 (16:31 IST)
అసలే నిండు గర్భిణి. ఆసుపత్రి చెకింగ్‌కు వెళ్ళాలనుకుంది. బంధువులు అందుబాటులో లేకపోవడంతో పక్కింటి వ్యక్తి సాయం తీసుకుంది. కానీ ఆ వ్యక్తే చివరకు తన జీవితాన్ని నాశనం చేస్తాడని ఊహించలేదు. రెండురోజుల పాటు గదిలో నిర్భంధించి అత్యాచారం చేయడమే కాకుండా అతిదారుణంగా హింసించాడు ఓ యువకుడు.
 
తెలంగాణా రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరుకు చెందిన ఒక మహిళకు కొంతకాలం క్రితమే వివాహమైంది. ఇప్పటికే ఇద్దరు సంతానం. ఆరు నెలల క్రితం గర్భం దాల్చడంతో పుట్టింటికి వచ్చింది. ప్రతి నెల ఆసుపత్రికి వెళ్ళి చెకప్ చేసుకుంటూ ఉండేది. 
 
అయితే నిన్న ఇంట్లో ఎవరూ లేకపోవడంతో నడుచుకుంటూ వెళ్ళి ఆటోలో వెళదామనుకుంది. అయితే మధ్యలో ఇంటి పక్కనే ఉన్న మల్లయ్య అనే యువకుడు కనిపించాడు. తన మోటారు సైకిల్ పైన ఆసుపత్రిలో దింపుతానని నమ్మించాడు. దీంతో నమ్మిన ఆమె స్కూటర్ ఎక్కింది. 
 
ఒక గదికి తీసుకెళ్ళి ఆ యువకుడు రెండురోజుల పాటు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎలాగోలా తప్పించుకుని ఆలేరు పోలీసులను ఆశ్రయించింది. అయితే పోలీసులు కేసు నమోదు చేయకపోగా పెద్దల పంచాయతీకి పంపించారు. దీనిపై మహిళ బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

Virgin: ఫోన్ల వర్షం - కానుకల వర్షంతో ప్రేక్షకులకు ఆఫర్ ఇస్తున్న వర్జిన్ బాయ్స్ టీమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments