Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరో ఘోరం... పరువు హత్యాయత్నం... ప్రేమికులపై కత్తితో దాడి...

సంచలనం సృష్టించిన ప్రణయ్ పరువు హత్య తర్వాత అలాంటి ఘోరమే ఎస్ఆర్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎర్రగడ్డ నడి రోడ్డు మీద ఓ ప్రేమజంటపై అమ్మాయి మేనమామ ఇద్దరిపై కత్తితో దాడి చేసి పరారయ్యాడు. ఈ ద

Webdunia
బుధవారం, 19 సెప్టెంబరు 2018 (17:15 IST)
సంచలనం సృష్టించిన ప్రణయ్ పరువు హత్య తర్వాత అలాంటి ఘోరమే ఎస్ఆర్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎర్రగడ్డ నడి రోడ్డు మీద ఓ ప్రేమజంటపై అమ్మాయి తండ్రి ఇద్దరిపై కత్తితో దాడి చేసి పరారయ్యాడు. ఈ దాడికి కారణం ప్రేమ వ్యవహారమేనని అనుమానిస్తున్నారు.
 
నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడలో జరిగిన పరువు హత్య ఘటన మరువక ముందే.. తెలంగాణ రాజధానిలో హైదరాబాదులో మరో దారుణ హత్యాయత్నం వెలుగుచూసింది. తమకు ఇష్టం లేకుండా ప్రేమ పెళ్లి చేసుకున్నారనే కారణంతో సందీప్(24) మాధవి(22)‌ జంటపై అమ్మాయి తండ్రి కత్తితో దాడికి పాల్పడ్డాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. 
 
ఈ దాడిలో సందీప్, మాధవికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను స్థానికులు సనత్‌నగర్‌లోని నీలిమ ఆస్పత్రికి తరలించారు. అమ్మాయి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కులాంతర వివాహమే ఈ ఘటనకు కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది. దీనిపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments