Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓ కుటుంబంఫై పగబట్టిన నీలిత్రాచు!

Webdunia
సోమవారం, 8 నవంబరు 2021 (11:02 IST)
తాచుపాములు పగబడతాయంటే చాలామంది నమ్మరు. కానీ ఇది నిజమని మహబూబాబాద్ జిల్లాలో జరిగిన ఘటనతో రుజువయ్యింది. నీలిత్రాచు పాము..ఓ కుటుంబం ఫై పగబట్టి..ఆ కుటుంబం మొత్తాన్ని కాటేసింది.

మహబూబాబాద్ జిల్లా పరిధిలోని శనిగపురంలో క్రాంతి, మమత దంపతులు పొలం పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు. ఈ క్రమంలో పొలం పనులు చేసుకుంటుండగా ఆ దంపతులపై పాము పగపట్టింది.

రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో క్రాంతి, మమత దంపతులతో పాటు వారి 3 నెలల చిన్నారిని పాము కాటేసింది. స్థానికులు పామును పట్టుకుని చంపేసి, పాముకాటుకు గురైన ముగ్గురిని ఆస్పత్రికి తరలించారు.

అప్పటికే చిన్నారి ప్రాణాలు కోల్పోగా.. ప్రాణాపాయ స్థితిలో చిన్నారి తల్లితండ్రులు చికిత్స పొందుతున్నారు. కాటేసిన పాము విషపూరితమైన నీలిత్రాచని స్థానికులు తెలిపారు.‌

పాముకాటుతో చిన్నారి ప్రాణాలు కోల్పోవడం, తల్లిదండ్రులు ఆసుపత్రి పాలు కావడంతో కుటుంబ సభ్యులను విషాదం లో నింపింది.

సంబంధిత వార్తలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments