Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అంబానీ కుటుంబం లండన్‌లో స్థిరపడుతుందన్న వార్తలు నిరాధారం: రిలయన్స్

అంబానీ కుటుంబం లండన్‌లో స్థిరపడుతుందన్న వార్తలు నిరాధారం: రిలయన్స్
, శుక్రవారం, 5 నవంబరు 2021 (22:40 IST)
ముకేశ్ అంబానీ లండన్‌లో స్థిరపడుతున్నారనే వార్త నిరాధారమైనదని, అతీతమైనదని రిలయన్స్ ఇండస్ట్రీస్ పేర్కొంది. లండన్‌లోని స్టోక్ పార్క్‌లో ఉన్న తన రెండవ ఇంటిని కుటుంబ సమేతంగా ముకేశ్ అంబానీ సెటిల్ చేయబోతున్నారని ఊహాగానాలు వచ్చాయి. ఈ ఊహాగానాలు అవాస్తమైనవనీ, తప్పుదారి పట్టించేవిగా కంపెనీ పేర్కొంది.

 
ఇటీవల, ఒక వార్తాపత్రిక లండన్‌లోని స్టోక్ పార్క్‌లో పాక్షికంగా స్థిరపడాలని అంబానీ కుటుంబం యోచిస్తున్నట్లు నివేదించింది. ఇది వాస్తవాలకు అతీతంగా ఉందని కంపెనీ తెలిపింది. ఈ వార్త వెలువడిన తర్వాత సోషల్ మీడియాలో కూడా ఈ ఊహాగానాలపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది.

 
కంపెనీ ఒక ప్రకటనలో, “రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్, ఆయన కుటుంబానికి లండన్ లేదా ప్రపంచంలోని మరే ఇతర భాగానికి మకాం మార్చడానికి లేదా నివసించడానికి ఎటువంటి ప్రణాళికలు లేవని స్పష్టం చేశారు. రిలయన్స్ గ్రూప్ యొక్క RIIHL లండన్‌లోని స్టోక్-పార్క్ ఎస్టేట్‌ను కొనుగోలు చేసింది. హెరిటేజ్ ప్రాపర్టీని గోల్ఫింగ్ మరియు స్పోర్టింగ్ రిసార్ట్‌గా మార్చాలని యోచిస్తోంది.

 
ఈ కొనుగోలు గ్రూప్ యొక్క వేగంగా అభివృద్ధి చెందుతున్న వినియోగదారుల వ్యాపారానికి జోడిస్తుందని కంపెనీ తెలిపింది. దీనితో పాటు, ఇది భారతదేశ ప్రఖ్యాత హాస్పిటాలిటీ పరిశ్రమను ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అందుకేనా పెట్రోల్ రేట్ తగ్గించింది? ఏం తెలివి మోడీజీ?