Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాయిలెట్ వాష్ బేషన్‌లో పడి పసిగుడ్డు మృతి

Webdunia
సోమవారం, 23 సెప్టెంబరు 2019 (21:20 IST)
టాయిలెట్ వాష్ బేషన్‌లో పడి పసిగుడ్డు మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సికింద్రాబాద్ రసూల్ పురలో కడుపు నొప్పితో ఓ యువతి బ్రైట్ హోమియో క్లినిక్‌కు వచ్చింది. కడుపు నొప్పి విపరీతం కాగా.. బాత్రూంకు వెళ్ళాలని కోరడంతో.. క్లినిక్‌లో బాత్రూం లేదని ఎదురుగా ఉన్న వారి ఇంటికి పంపించారు.
 
బాత్రూం నుంచి తీవ్ర రక్తస్రావంతో బయటకి రాగా.. పుట్టిన పాప సింక్‌లో పడిపోయిందని ఆ ఇంటివారికి తెలిపింది. దీంతో ఆ ఇంటివారు వెంటనే బయటకు తీసి పోలీసులకు సమాచారం అందించి, గాంధీ ఆసుపత్రికి తరలించారు. కాని అప్పటికే పసిగుడ్డు కన్నుమూయగా, అవివాహిత కావడంతో విషయం బయటకు రాకుండా జాగ్రత్తపడ్డారు.
 
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కానీ పాప మృతిపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. అబార్షన్ కోసమే వైద్యురాలి దగ్గరకు వచ్చిందని.. ఆమె ఇచ్చిన మెడిసిన్‌తోనే ఇలా జరిగి ఉండవచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బేగంపేట పోలీసుల మాత్రం విషయం బయటకు రాకుండా అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేశారు.
 
వైద్యురాలు మాత్రం ఆసుపత్రి మూసి అందుబాటులో లేకుండా పోయారు. పధకం ప్రకారం వాష్ బేషన్‌లో వేసి పాపను చంపిందా లేక పడిపోయిందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

దేవిక అండ్ డానీ వంటి వెబ్ సిరీస్ చేయ‌టం నా అదృష్టం : హీరోయిన్ రీతూవ‌ర్మ‌

పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" చిత్రం మళ్లీ వాయిదానా?

Tarun Bhaskar: నాన్న కి కో వస్తే కామన్ గా తిట్టే పదం బద్మాష్ : తరుణ్ భాస్కర్

Rana: నాయుడు కుటుంబం ఏ ప‌నిని అసంపూర్తిగా చేయ‌దు అనేదే రానా నాయుడు సీజ‌న్‌2

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

తర్వాతి కథనం
Show comments