Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాయిలెట్ వాష్ బేషన్‌లో పడి పసిగుడ్డు మృతి

Webdunia
సోమవారం, 23 సెప్టెంబరు 2019 (21:20 IST)
టాయిలెట్ వాష్ బేషన్‌లో పడి పసిగుడ్డు మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సికింద్రాబాద్ రసూల్ పురలో కడుపు నొప్పితో ఓ యువతి బ్రైట్ హోమియో క్లినిక్‌కు వచ్చింది. కడుపు నొప్పి విపరీతం కాగా.. బాత్రూంకు వెళ్ళాలని కోరడంతో.. క్లినిక్‌లో బాత్రూం లేదని ఎదురుగా ఉన్న వారి ఇంటికి పంపించారు.
 
బాత్రూం నుంచి తీవ్ర రక్తస్రావంతో బయటకి రాగా.. పుట్టిన పాప సింక్‌లో పడిపోయిందని ఆ ఇంటివారికి తెలిపింది. దీంతో ఆ ఇంటివారు వెంటనే బయటకు తీసి పోలీసులకు సమాచారం అందించి, గాంధీ ఆసుపత్రికి తరలించారు. కాని అప్పటికే పసిగుడ్డు కన్నుమూయగా, అవివాహిత కావడంతో విషయం బయటకు రాకుండా జాగ్రత్తపడ్డారు.
 
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కానీ పాప మృతిపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. అబార్షన్ కోసమే వైద్యురాలి దగ్గరకు వచ్చిందని.. ఆమె ఇచ్చిన మెడిసిన్‌తోనే ఇలా జరిగి ఉండవచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బేగంపేట పోలీసుల మాత్రం విషయం బయటకు రాకుండా అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేశారు.
 
వైద్యురాలు మాత్రం ఆసుపత్రి మూసి అందుబాటులో లేకుండా పోయారు. పధకం ప్రకారం వాష్ బేషన్‌లో వేసి పాపను చంపిందా లేక పడిపోయిందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bhavana : నా భర్తతో సంతోషంగా వున్నాను.. విడాకుల కథలన్నీ అబద్ధాలే: భావన

ఆర్ట్ డైరెక్ట‌ర్‌ల‌తో డైరెక్ట‌ర్ల‌ బంధం ఎంతో ముఖ్య‌మైంది : హరీష్ శంకర్

య‌ష్ లేటెస్ట్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోనప్స్’ సెట్స్‌లో అమెరిక‌న్ న‌టుడు కైల్ పాల్‌

Mohan Babu: పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్నా.. నేను మీ పక్కన ఉండే అవకాశాన్ని కోల్పోయాను (video)

Prabhas: థమన్ వల్లే రాజా సాబ్ విడుదల లేట్ అవుతుందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments