Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో తొమ్మిదో తరగతి విద్యార్థి గుండెపోటుతో మృతి

Webdunia
గురువారం, 17 ఆగస్టు 2023 (22:39 IST)
తెలంగాణలో తొమ్మిదో తరగతి విద్యార్థి గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటన ఖమ్మం పట్టణంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... ఎం. రాజేష్ (14) స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తరగతులకు హాజరవుతుండగా ఛాతిలో నొప్పి రావడంతో కుప్పకూలిపోయాడు.
 
స్కూల్ టీచర్లు అతడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో గుండెపోటుతో మరణించే వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. 
 
హైదరాబాద్‌లో బ్యాడ్మింటన్ ఆడుతూ 46 ఏళ్ల వ్యక్తి మరణించిన ఒక రోజు తర్వాత ఇది జరిగింది. రామాంతపూర్ ప్రాంతంలోని ఓ ప్లేగ్రౌండ్‌లో కొంతమంది స్నేహితులతో కలిసి గేమ్ ఆడుతూ కె.కృష్ణారెడ్డి కుప్పకూలిపోయాడు.
 
గత వారం, తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో 16 ఏళ్ల విద్యార్థిని తన కళాశాల వేడుకలో డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

యోగేష్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో థ్రిల్లర్ చిత్రం త్రిముఖ పోస్టర్

ఇండస్ట్రీ కి రావడమే ఓ కలగా వుంది - ఇకపై నటిగా కూడా కొనసాగుతా : జెనీలియా

అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. జరగరాని నష్టం జరిగిపోయింది.. పా.రంజిత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

తర్వాతి కథనం
Show comments