Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్ నగరంలో బాలిక మిస్సింగ్.. చెరువులో శవమై తేలింది...

Webdunia
శుక్రవారం, 16 డిశెంబరు 2022 (12:23 IST)
హైదరాబాద్ నగరంలో అదశ్యమైన ఓ బాలిక కథ విషాదంగా ముగిసింది. ఆ బాలిక చెరువులో శవమై తేలింది. గురువారం కనిపించకుండా పోయిన ఈ చిన్నారి శుక్రవారం చెరువులో శవంగా కనిపించింది. దమ్మాయిగూడకు చెరువులో ఆ బాలిక మృతేదహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం కోసం పంపించారు. అయితే, మృతదేహాన్ని తల్లిదండ్రులతో పాటు స్థానికులకు చూపించకుండా పోలీసుల ఆస్పత్రికి తరలించడం పలు అనుమానాలకు తావిస్తుంది. 
 
మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్‌కు చెందిన 4వ తరగతి విద్యార్థిని గురువారం ఉన్నట్టుండి కనిపించకుండా పోయింది. తమ బిడ్డ గురువారం ఎప్పటిలాగానే స్కూలుకు వెళ్లిందని తల్లిదండ్రులు చెప్పారు. కానీ, మధ్యాహ్నానికి పాప కనిపించడంలేదంటూ స్కూల్ నుంచి ఫోన్ రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. పైగా, ఆ పాపకు చెందిన స్కూల్ బ్యాగు, పుస్తకాలు తరగతి గదిలోనే ఉన్నాయని, కానీ, పుస్తకాలు లేవని టీచర్ సమాచారం చేరవేసింది. 
 
దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు ఆయన చెప్పారు. దీంతో కేసు నమోదుచేసిన పోలీసులు. స్కూల్ పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ కెమెరాల పుటేజీలను సేవకరించి తనిఖీ చేయడం మొదలుపెట్టారు. ఇంతలోనే ఆ బాలిక దమ్మాయిగూడ చెరువులో శవమై కనిపించింది. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments