Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైకోర్టులో దసరా పండుగ - ఒకే రోజు ఏడుగురు జడ్జీలు

Webdunia
శుక్రవారం, 15 అక్టోబరు 2021 (17:46 IST)
తెలంగాణ హైకోర్టులో దసరా పండుగ వాతావరణం నెలకొంది. ఒకేసారి ఏడుగురు న్యాయమూర్తులు జడ్జీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. సుప్రీంకోర్టు కొలీజియం నియమించిన ఏడుగురు న్యాయమూర్తులు శుక్రవారం ప్రమాణం చేశారు. 
 
హైకోర్టు ఫస్ట్‌ కోర్టు హాలు వేదికగా శుక్రవారం ఉదయం 10.30 గంటలకు కొత్త న్యాయ‌మూర్తుల చేత ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ స‌తీశ్ చంద్ర‌శ‌ర్మ ప్ర‌మాణం చేయించారు. 
 
న్యాయ‌మూర్తులుగా ప్ర‌మాణం చేసిన వారిలో జ‌స్టిస్ పెరుగు శ్రీ సుధా, జ‌స్టిస్ డాక్ట‌ర్ చిల్ల‌కూరు సుమ‌ల‌త‌, జ‌స్టిస్ డాక్ట‌ర్ గురిజాల రాధారాణి, జ‌స్టిస్ మున్నూరి ల‌క్ష్మ‌ణ్‌, జ‌స్టిస్ ఎన్.తుకారాం జీ, జ‌స్టిస్ వెంక‌టేశ్వ‌ర్ రెడ్డి, జ‌స్టిస్ ప‌టోళ్ల మాధ‌వి దేవీ ఉన్నారు.
 
తెలంగాణ హైకోర్టు ఏర్పాటైన తర్వాత తొలిసారి ఏడుగురు న్యాయాధికారులకు న్యాయమూర్తులుగా పదోన్నతి లభించింది. కొత్త న్యాయమూర్తులు ఈ నెల 18న ప్రమాణం చేయాలని తొలుత భావించారు. 
 
విజయదశమి పండుగ నాడు ప్రమాణం చేసేందుకే ఎక్కువ మంది ఆసక్తి చూపడంతో తేదీని శుక్రవారానికి మార్చారు. ఒకేసారి ఏడుగురు న్యాయమూర్తులు ప్రమాణం చేయడం హైకోర్టు చరిత్రలో ఇదే తొలిసారి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments