Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫలక్‌నుమా రైల్లో మంటలు... తగలబడిన మూడు బోగీలు

Webdunia
శుక్రవారం, 7 జులై 2023 (14:26 IST)
హౌరా - సికింద్రాబాద్ ప్రాంతాల మధ్య నడిచే ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ రైలులో శుక్రవారం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలోని రైలులోని మూడు బోగీలు మంటల్లో కాలిపోయాయి. బీబీ నగర్ మండలంలో ఈ ప్రమాదం జరిగింది. హౌరా నుంచి సికింద్రాబాద్‌కు వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. 
 
యాదాద్రి జిల్లా బీబీ నగర్ మండలం పగిడిపల్లి - బొమ్మాయిపల్లి మధ్య అగ్నిప్రమాదానికి గురైంది. అయితే, ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగివుండొచ్చని భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఒక్కసారిగా రైలులో మంటలు చెలరేగాయి. ఏకంగా ఆరు బోగాలకు మంటలు అంటుకోగా, వాటిలో నాలుగు బోగీలు పూర్తిగా కాలిపోయాయి. 
 
ఈ రైలు నుంచి పొగలు రావడాన్ని గుర్తించిన ప్రయాణికులు చైను లాగి కిందకు దిగిపోయారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో ఒక్క ప్రయాణికుడికి కూడా ఎలాంటి గాయాలు కాలేదు. సమాచారం అందుకున్న అగ్నిమాపకదళ సిబ్బంది, రైల్వే ఉన్నతాధికారులు మంటలను అదుపులోకి తెచ్చారు. దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ హుటాహుటిన ప్రమాద స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వారం ముందుగానే థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న లిటిల్ హార్ట్స్

సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా.. జటాధర నుంచి దివ్య ఖోస్లా ఫస్ట్ లుక్

కామెడీ చేసే నటులు దొరకడం ఇంకా కష్టం : సుందరకాండ డైరెక్టర్ వెంకటేష్

తెలీని కథతో అందరినీ ఆకట్టుకునేలా వుండేదే త్రిబాణధారి బార్బరిక్ : దర్శకుడు మోహన్ శ్రీవత్స

Kavya Thapar: నేను రెడీ హీరోయిన్ కావ్య థాపర్ పోస్టర్ కు హ్యూజ్ రెస్పాన్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments