Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫలక్‌నుమా రైల్లో మంటలు... తగలబడిన మూడు బోగీలు

Webdunia
శుక్రవారం, 7 జులై 2023 (14:26 IST)
హౌరా - సికింద్రాబాద్ ప్రాంతాల మధ్య నడిచే ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ రైలులో శుక్రవారం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలోని రైలులోని మూడు బోగీలు మంటల్లో కాలిపోయాయి. బీబీ నగర్ మండలంలో ఈ ప్రమాదం జరిగింది. హౌరా నుంచి సికింద్రాబాద్‌కు వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. 
 
యాదాద్రి జిల్లా బీబీ నగర్ మండలం పగిడిపల్లి - బొమ్మాయిపల్లి మధ్య అగ్నిప్రమాదానికి గురైంది. అయితే, ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగివుండొచ్చని భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఒక్కసారిగా రైలులో మంటలు చెలరేగాయి. ఏకంగా ఆరు బోగాలకు మంటలు అంటుకోగా, వాటిలో నాలుగు బోగీలు పూర్తిగా కాలిపోయాయి. 
 
ఈ రైలు నుంచి పొగలు రావడాన్ని గుర్తించిన ప్రయాణికులు చైను లాగి కిందకు దిగిపోయారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో ఒక్క ప్రయాణికుడికి కూడా ఎలాంటి గాయాలు కాలేదు. సమాచారం అందుకున్న అగ్నిమాపకదళ సిబ్బంది, రైల్వే ఉన్నతాధికారులు మంటలను అదుపులోకి తెచ్చారు. దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ హుటాహుటిన ప్రమాద స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments