Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫలక్‌నుమా రైల్లో మంటలు... తగలబడిన మూడు బోగీలు

Webdunia
శుక్రవారం, 7 జులై 2023 (14:26 IST)
హౌరా - సికింద్రాబాద్ ప్రాంతాల మధ్య నడిచే ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ రైలులో శుక్రవారం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలోని రైలులోని మూడు బోగీలు మంటల్లో కాలిపోయాయి. బీబీ నగర్ మండలంలో ఈ ప్రమాదం జరిగింది. హౌరా నుంచి సికింద్రాబాద్‌కు వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. 
 
యాదాద్రి జిల్లా బీబీ నగర్ మండలం పగిడిపల్లి - బొమ్మాయిపల్లి మధ్య అగ్నిప్రమాదానికి గురైంది. అయితే, ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగివుండొచ్చని భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఒక్కసారిగా రైలులో మంటలు చెలరేగాయి. ఏకంగా ఆరు బోగాలకు మంటలు అంటుకోగా, వాటిలో నాలుగు బోగీలు పూర్తిగా కాలిపోయాయి. 
 
ఈ రైలు నుంచి పొగలు రావడాన్ని గుర్తించిన ప్రయాణికులు చైను లాగి కిందకు దిగిపోయారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో ఒక్క ప్రయాణికుడికి కూడా ఎలాంటి గాయాలు కాలేదు. సమాచారం అందుకున్న అగ్నిమాపకదళ సిబ్బంది, రైల్వే ఉన్నతాధికారులు మంటలను అదుపులోకి తెచ్చారు. దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ హుటాహుటిన ప్రమాద స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments