Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫలక్‌నుమా రైల్లో మంటలు... తగలబడిన మూడు బోగీలు

Webdunia
శుక్రవారం, 7 జులై 2023 (14:26 IST)
హౌరా - సికింద్రాబాద్ ప్రాంతాల మధ్య నడిచే ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ రైలులో శుక్రవారం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలోని రైలులోని మూడు బోగీలు మంటల్లో కాలిపోయాయి. బీబీ నగర్ మండలంలో ఈ ప్రమాదం జరిగింది. హౌరా నుంచి సికింద్రాబాద్‌కు వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. 
 
యాదాద్రి జిల్లా బీబీ నగర్ మండలం పగిడిపల్లి - బొమ్మాయిపల్లి మధ్య అగ్నిప్రమాదానికి గురైంది. అయితే, ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగివుండొచ్చని భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఒక్కసారిగా రైలులో మంటలు చెలరేగాయి. ఏకంగా ఆరు బోగాలకు మంటలు అంటుకోగా, వాటిలో నాలుగు బోగీలు పూర్తిగా కాలిపోయాయి. 
 
ఈ రైలు నుంచి పొగలు రావడాన్ని గుర్తించిన ప్రయాణికులు చైను లాగి కిందకు దిగిపోయారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో ఒక్క ప్రయాణికుడికి కూడా ఎలాంటి గాయాలు కాలేదు. సమాచారం అందుకున్న అగ్నిమాపకదళ సిబ్బంది, రైల్వే ఉన్నతాధికారులు మంటలను అదుపులోకి తెచ్చారు. దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ హుటాహుటిన ప్రమాద స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తిరగబడరసామీ లో యాక్షన్, ఎమోషన్స్, ఎంటర్ టైన్మెంట్ చాలా కొత్తగా వుంటుంది : రాజ్ తరుణ్

శేఖర్ కమ్ముల 'కుబేర' నుంచి రష్మిక మందన్న ఫస్ట్ లుక్ రాబోతుంది

కొరియోగ్రాఫర్ నుంచి అధ్యక్షుడిగా ఎదిగిన జానీ మాస్టర్

20 కోట్ల బడ్జెట్ తో పీరియాడిక్ థ్రిల్లర్ గా హీరో కిరణ్ అబ్బవరం చిత్రం ?

విరాజి కథ విన్నప్పుడే గూస్ బంప్స్ వచ్చాయి : హీరో వరుణ్ సందేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments