Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మో.. ఆమె కడుపులో 20 రాళ్ళు.. ఒక్కో రాయి సైజు 20మి.మి

Webdunia
శనివారం, 20 మార్చి 2021 (17:19 IST)
Kidney
కిడ్నీలో రాళ్లు రావడం ప్రస్తుతం ఫ్యాషనైపోయింది. ఆహారప అలవాట్లు మారడం.. ఫాస్ట్ ఫుడ్స్ తీసుకోవడం ద్వారా కిడ్నీలో రాళ్లు ఏర్పడుతున్నాయి. కానీ ఇక్కడ సీన్ వేరేలా వుంది. ఓ మహిళ గాల్‌బ్లాడర్‌లో ఏకంగా 20 వరకు రాళ్లు.. అవి కూడా 20మి.మీ. ఉండటం గమనార్హం.

వివరాల్లోకి వెళితే.. నస్రీన్‌ అనే యువతి రెండేళ్లుగా తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతున్నారు. ఈ క్రమంలో చికిత్సకోసం నిర్మల్, నిజామాబాద్, హైదరాబాద్‌లతోపాటు మహారాష్ట్రలోని నాందేడ్‌ వరకూ వెళ్లారు. అనేక ప్రైవేటు ఆసుపత్రులు తిరిగారు. సమస్య మాత్రం తీరలేదు. 
 
చివరకు నిర్మల్‌ జిల్లా కేంద్రంలోనే దేవీబాయి ఆస్పత్రి వైద్యుడు అవినాశ్‌ కాసావార్‌ను కలిశారు. గాల్‌బ్లాడర్‌లో పెద్ద మొత్తంలో రాళ్లు ఉండటం వల్లే కడుపునొప్పి వస్తున్నట్లు ఆయన గుర్తించారు.

ఈ మేరకు శుక్రవారం ల్యాపరోస్కోపి విధానంలో ఆపరేషన్‌ చేయగా, ఆమె గాల్‌బ్లాడర్‌లో సుమారు 20 రాళ్లు, ఒక్కో రాయి సైజు 20 మి.మీ. ఉన్నవి బయటపడ్డాయి. ఇలాంటి అరుదైన ఆపరేషన్‌ జిల్లాలోనే తొలిసారిగా చేసినట్లు వైద్యుడు అవినాశ్‌ తెలిపారు.

సంబంధిత వార్తలు

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments