Webdunia - Bharat's app for daily news and videos

Install App

దీపావళి వేడుకల్లో అపశృతి : గాయాలపాలైన 27 మంది

Webdunia
శుక్రవారం, 5 నవంబరు 2021 (13:05 IST)
హైదరాబాద్ నగరంలో జరిగిన దీపావళి పేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. పలు ప్రాంతాల్లో బాణాసంచా పేల్చే సమయంలో ఏర్పడిన చిన్నపాటి అగ్నిప్రమాదాల్లో అనేక మంది గాయపడ్డారు. ఇలా ఇప్పటివరకు 27 మంది గాయపడ్డారు. వీరందరినీ మెహదీపట్నంలోని సరోజినీదేవి కంటి ఆస్పత్రికి తరలించారు. 
 
ఇందులో స్వల్పంగా గాయాలైన 22 మందికి చికిత్స అందించి ఇంటికి పంపించారు. తీవ్రంగా గాయపడిన ఐదుగురిని హాస్పిటల్‌లో అడ్మిట్‌ చేసుకుని చికిత్స అందిస్తున్నారు. వారిలో ముగ్గురు చిన్నారులకు సర్జరీ చేశామని, ప్రస్తుతం వారిని అబ్జర్వేషన్‌లో ఉంచినట్టు ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. 
 
పాతబస్తీలోని ఛత్రినాక పరిధిలో ఉన్న కందికల్‌ గేటు దగ్గర పేలుడు జరిగింది. పేలుడు ధాటికి ఇద్దరు మృతి చెందగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. కందికల్‌లోని పీవోపీతో బొమ్మలు తయారుచేసే పరిశ్రమలో గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒక్కసారిగా పేలుడు సంభవించింది. 
 
దీంతో పశ్చిమబెంగాల్‌కు చెందిన విష్ణు, జగన్‌ అక్కడికక్కడే మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రుడిని దవాఖానకు తరలిచారు. పటాకులకు రసాయనాలు తోడవడంతో పేలుడు తీవ్రత అధికంగా ఉందని పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun : 21 ఏళ్ళకు ఎంట్రీ, 22 ఏళ్ళ కెరీర్ లో ఎత్తుపల్లాలు చూసిన బన్నీ

మాతృ మూవీ లో చూస్తున్నవేమో.. పాటను అభినందించిన తమ్మారెడ్డి భరద్వాజ్

Mad Square Review : మ్యాడ్ స్క్వేర్ రివ్యూ

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments