Webdunia - Bharat's app for daily news and videos

Install App

దీపావళి వేడుకల్లో అపశృతి : గాయాలపాలైన 27 మంది

Webdunia
శుక్రవారం, 5 నవంబరు 2021 (13:05 IST)
హైదరాబాద్ నగరంలో జరిగిన దీపావళి పేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. పలు ప్రాంతాల్లో బాణాసంచా పేల్చే సమయంలో ఏర్పడిన చిన్నపాటి అగ్నిప్రమాదాల్లో అనేక మంది గాయపడ్డారు. ఇలా ఇప్పటివరకు 27 మంది గాయపడ్డారు. వీరందరినీ మెహదీపట్నంలోని సరోజినీదేవి కంటి ఆస్పత్రికి తరలించారు. 
 
ఇందులో స్వల్పంగా గాయాలైన 22 మందికి చికిత్స అందించి ఇంటికి పంపించారు. తీవ్రంగా గాయపడిన ఐదుగురిని హాస్పిటల్‌లో అడ్మిట్‌ చేసుకుని చికిత్స అందిస్తున్నారు. వారిలో ముగ్గురు చిన్నారులకు సర్జరీ చేశామని, ప్రస్తుతం వారిని అబ్జర్వేషన్‌లో ఉంచినట్టు ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. 
 
పాతబస్తీలోని ఛత్రినాక పరిధిలో ఉన్న కందికల్‌ గేటు దగ్గర పేలుడు జరిగింది. పేలుడు ధాటికి ఇద్దరు మృతి చెందగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. కందికల్‌లోని పీవోపీతో బొమ్మలు తయారుచేసే పరిశ్రమలో గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒక్కసారిగా పేలుడు సంభవించింది. 
 
దీంతో పశ్చిమబెంగాల్‌కు చెందిన విష్ణు, జగన్‌ అక్కడికక్కడే మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రుడిని దవాఖానకు తరలిచారు. పటాకులకు రసాయనాలు తోడవడంతో పేలుడు తీవ్రత అధికంగా ఉందని పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments