దేశంలో కనిష్టానికి చేరుకున్న కరోనా యాక్టివ్ కేసులు

Webdunia
శుక్రవారం, 5 నవంబరు 2021 (12:22 IST)
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల నమోదు సంఖ్యలో తగ్గుదల కనిపిస్తుంది. గత కొన్ని రోజులుగా 15 వేలకు దిగువున నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కూడా దేశంలో కొత్తగా 12,729 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,43,33,754కు చేరింది. 
 
ప్రస్తుతం దేశంలో 1,48,922 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మరో 4,59,873 మంది మరణించగా, 3,37,24,959 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. అయితే, గత 2020, మార్చి తర్వాత యాక్టివ్‌ కేసుల రేటు కనిష్టానికి చేరింది. 
 
ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 0.43 శాతంగా ఉండగా, కరోనా రికవరీ రేటు 98.23 శాతానికి పెరిగాయి. గత 24 గంటల్లో కొత్తగా 221 మంది మరణించగా, 12,165 మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎన్నికల్లో పోటీ చేస్తే ఓడిపోతా.. మా కుటుంబం నుంచే మూడు ఓట్లు కూడా రావు : సల్మాన్

వేధింపులు భరించలేకే 'అమ్మ' కార్యదర్శి పదవికి రాజీనామా : అన్సిబా హాసన్

Nikhil: స్వయంభూ విఎఫ్.ఎక్స్. టెక్నీషియన్లను పర్యవేక్షించిన నిఖిల్, సెంథిల్

Venkatesh Iyer: అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళి గిఫ్ట్ ఇచ్చిన క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్

Allu Arjun: అల్లు అర్జున్ శక్తిమాన్‌గా చేస్తున్నాడా?

తర్వాతి కథనం
Show comments