Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో విస్తారంగా వర్షాలు : గోనెపల్లి వాగులో ఇద్దరి గల్లంతు

Webdunia
ఆదివారం, 5 సెప్టెంబరు 2021 (17:05 IST)
తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పెద్ద ఎత్తున వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. సిద్దిపేట జిల్లా కురిసిన వర్షాలకు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. చిన్నకోడూరు మండలం గోనెపల్లి వాగులో ఆదివారం ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. 
 
సదరు వ్యక్తులను మధ్యప్రదేశ్‌కు చెందిన తోమర్‌ సింగ్‌, మహారాష్ట్రలోని ముంబై వాసి సురేష్‌గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు వాగు వద్దకు చేరుకొని.. గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు. ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.
 
మరోవైపు, గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు జలాశయాలు నిండుకుండలా కనిపిస్తున్నాయి. ఎగువ నుంచి వరద పోటెత్తడంతో శ్రీరాం సాగర్​, దిగువ మానేరు, కోయిల్​సాగర్​ ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. గేట్లను తెరిచి అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 
 
​నిజామాబాద్​ జిల్లాలోని శ్రీరాంసాగర్​ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ప్రాజెక్టుకు ఇన్​ఫ్లో 46,558 క్యూసెక్కులు ఉండగా.. 11గేట్ల ద్వారా 37,440 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. విద్యుదుత్పత్తి ద్వారా 7,500 క్యూసెక్కులు దిగువకు విడదల అవుతోంది. ప్రాజెక్టు గరిష్ఠ నీటిమట్టం 1091 అడుగులు కాగా.. ప్రస్తుతం అంతే మొత్తానికి చేరుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments