శ్రీ చైతన్య స్కూల్ మూడో అంతస్తు నుంచి దూకిన 15 ఏళ్ల విద్యార్థిని

Webdunia
శనివారం, 4 మార్చి 2023 (11:00 IST)
10వ తరగతి చదువుతున్న కొలిపాక సాయి శరణ్య అనే 15 ఏళ్ల విద్యార్థిని శుక్రవారం సాయంత్రం ఖమ్మంలోని శ్రీశ్రీ సర్కిల్‌లోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్‌లోని మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటనలో ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. 
 
పాఠశాల సిబ్బంది ఆమెను పట్టణంలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించినా పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనకు యాజమాన్యమే కారణమంటూ పీడీఎస్‌యూ కార్యకర్తలు పాఠశాలలోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేసి నిరసనకు దిగారు. అయితే, పాఠశాల యాజమాన్యం ఆరోపణలను కొట్టిపారేసింది.
 
బాలిక ప్రమాదవశాత్తు భవనంపై నుండి పడిపోయిందని పేర్కొంది. ఆమె పాదరక్షలు మూడో అంతస్తు మెట్లపై కనిపించాయి. శరణ్య సాయంత్రం తన క్లాస్‌మేట్స్‌తో కలిసి మూడవ అంతస్తులోని వాష్‌రూమ్‌కు వెళ్లింది, అయితే ఆ తర్వాత గ్రౌండ్ ఫ్లోర్‌లో రక్తపు మడుగులో కనిపించింది. 
 
శరణ్య తల్లిదండ్రులు మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించగా, స్కూల్ యాజమాన్యం ఘటనను గోప్యంగా ఉంచేందుకు ప్రయత్నించి మీడియా ప్రతినిధులను ప్రాంగణంలోకి రానీయకుండా అడ్డుకుంది. 
 
శరణ్యకు రెండు కాళ్లు, చేతులు ఫ్రాక్చర్ అయ్యాయని, ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు నిర్ధారించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajinikanth Birthday Special: సూపర్ స్టార్ 75వ పుట్టిన రోజు.. 50ఏళ్ల సినీ కెరీర్ ప్రస్థానం (video)

Akhanda 2 Review,అఖండ 2 తాండవం.. హిట్టా. ఫట్టా? అఖండ 2 రివ్యూ

దక్షిణాదిలో జియో హాట్‌స్టార్ రూ.4 వేల కోట్ల భారీ పెట్టుబడి

Peddi: పెద్ది కొత్త షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభం, మార్చి 27న రిలీజ్

Rana: టైం టెంపరరీ సినిమా అనేది ఫరెవర్ : రానా దగ్గుబాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ శీతాకాలంలో కాలిఫోర్నియా బాదంతో మీ చర్మానికి తగిన సంరక్షణను అందించండి

తులసి పొడితో హెయిర్ ప్యాక్ వేసుకుంటే.. జుట్టు నెరవదు.. తెలుసా?

Tomato Soup: శీతాకాలంలో టమోటా సూప్ తీసుకుంటే?

నీలి రంగు శంఖులో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..? మహిళలు శంఖు పువ్వు టీ తాగితే?

రాత్రిపూట ఇవి తింటున్నారా? ఐతే తెలుసుకోవాల్సిందే

తర్వాతి కథనం
Show comments