Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీచైతన్య జూనియర్ కాలేజీలో 14 మంది విద్యార్థులకు కరోనా

Webdunia
బుధవారం, 29 డిశెంబరు 2021 (16:19 IST)
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ మళ్లీ శరవేగంగా వ్యాపిస్తోంది. ఒకవైపు కరోనా, మరోవైపు ఒమిక్రాన్ కేసులు పెరిగిపోతున్నాయి. తాజాగా హైదరాబాద్ నగరంలోని నార్శింగిలో ఉన్న శ్రీచైతన్య జూనియర్ కాలేజీలో 14 మంది విద్యార్థులకు కరోనా వైరస్ సోకింది. దీంతో తోటి విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. 
 
గత రెండు రోజులుగా చలి, తీవ్ర జ్వరంతో బాధపడుతున్న విద్యార్థులకు కోవిడ్ టెస్టులు చేయగా, వారికి కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో వారిని క్వారంటైన్‌కు తరలించారు. 
 
ఈ విషయం తెలిసిన నార్సింగి మున్సిపల్ అధికారులు అప్రమత్తమయ్యారు. కాలేజీ మొత్తాన్ని శానిటైజ్ చేశారు. మిగిలిన విద్యార్థులను కూడా హోం ఐసోలేషన్‌కు తరలించారు. పాజిటివ్ వచ్చిన విద్యార్థుల్లో వచ్చిన వేరియంట్‌ను నిర్ధారణ చేసేందుకు వారి శాంపిల్స్‌ను సేకరించి జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

సరికొత్త స్క్రీన్ ప్లేతో వస్తున్న 28°C మూవీ మెస్మరైజ్ చేస్తుంది : డైరెక్టర్ డా. అనిల్ విశ్వనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments