తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 13 మండలాలు - సర్కారు జీవో జారీ

Webdunia
ఆదివారం, 24 జులై 2022 (11:45 IST)
విభజన తర్వాత తెలంగాణ రాష్ట్రంలోని 13 జిల్లాలను 31కు పెంచారు. ఇపుడు కొత్తగా మరో 13 మండలాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు తొమ్మిది జిల్లాల్లో 13 కొత్త మండలాలను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీ చేసింది. 
 
స్థానిక ప్రజావసరాల మేరకు మరికొన్ని మండలాలు ఏర్పాటు చేయాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలకు అనుగుణంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ శనివారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. 
 
రాష్ట్రంలో ప్రస్తుతం 594 మండలాలుండగా కొత్త వాటితో కలిపి మొత్తం సంఖ్య 607కి చేరనుంది. కొత్త మండలాల ఏర్పాటుపై 15 రోజుల్లోగా అభ్యంతరాలు, వినతులను సంబంధిత జిల్లా కలెక్టర్లకు అందించాల్సి ఉంటుంది. వాటన్నింటినీ పరిశీలించిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తుది నోటిఫికేషన్‌ జారీ చేయనుంది.
 
కొత్తగా ఏర్పాటు చేసిన మండలాలను పరిశీలిస్తే... నల్గొండ జిల్లాలో గట్టుప్పల్, నారాయణ పేట జిల్లాలో గుండుమల్, కొత్తపల్లె, వికారాబాద్ జిల్లాలో దుడ్యాల్, మహబూబ్ నగర్ జిల్లాలో కౌకుంట్ల, నిజాబాద్ జిల్లాలో ఆలూర్, డొంకేశ్వర్, సారూర, మహబూబాబాద్ జిల్లాలో సీరోల్, సంగారెడ్డి జిల్లాలో నిజాంపేట్, కామారెడ్డి జిల్లాలో డోంగ్లి, జగిత్యాల జిల్లాలో ఎండపల్లి, భీమారం కేంద్రాలుగా కొత్త మండలాలను ఏర్పాటు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నారా రోహిత్, శిరీష ప్రీ - వెడ్డింగ్ వేడుకలు ప్రారంభం.. పెళ్లి ముహూర్తం ఎప్పుడంటే?

Devi Sri Prasad: ఈసారైనా దేవీశ్రీ ప్రసాద్ హీరోగా క్లిక్ అవుతాడా, కీర్తి సురేష్ జంటగా చేస్తుందా...

Rahul: హాస్టల్లో ఉండే రోజుల్లో ది గర్ల్ ఫ్రెండ్ ఐడియా వచ్చింది: రాహుల్ రవీంద్రన్

ఉపాసన సీమంతంలో అల్లు అర్జున్ ఎక్కడ? ఎందుకు పక్కనబెట్టారు?

దేవ్ పారు నుంచి కాలభైరవ పాడిన నా ప్రాణమంత సాంగ్ లాంచ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments