Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 13 మండలాలు - సర్కారు జీవో జారీ

Webdunia
ఆదివారం, 24 జులై 2022 (11:45 IST)
విభజన తర్వాత తెలంగాణ రాష్ట్రంలోని 13 జిల్లాలను 31కు పెంచారు. ఇపుడు కొత్తగా మరో 13 మండలాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు తొమ్మిది జిల్లాల్లో 13 కొత్త మండలాలను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీ చేసింది. 
 
స్థానిక ప్రజావసరాల మేరకు మరికొన్ని మండలాలు ఏర్పాటు చేయాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలకు అనుగుణంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ శనివారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. 
 
రాష్ట్రంలో ప్రస్తుతం 594 మండలాలుండగా కొత్త వాటితో కలిపి మొత్తం సంఖ్య 607కి చేరనుంది. కొత్త మండలాల ఏర్పాటుపై 15 రోజుల్లోగా అభ్యంతరాలు, వినతులను సంబంధిత జిల్లా కలెక్టర్లకు అందించాల్సి ఉంటుంది. వాటన్నింటినీ పరిశీలించిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తుది నోటిఫికేషన్‌ జారీ చేయనుంది.
 
కొత్తగా ఏర్పాటు చేసిన మండలాలను పరిశీలిస్తే... నల్గొండ జిల్లాలో గట్టుప్పల్, నారాయణ పేట జిల్లాలో గుండుమల్, కొత్తపల్లె, వికారాబాద్ జిల్లాలో దుడ్యాల్, మహబూబ్ నగర్ జిల్లాలో కౌకుంట్ల, నిజాబాద్ జిల్లాలో ఆలూర్, డొంకేశ్వర్, సారూర, మహబూబాబాద్ జిల్లాలో సీరోల్, సంగారెడ్డి జిల్లాలో నిజాంపేట్, కామారెడ్డి జిల్లాలో డోంగ్లి, జగిత్యాల జిల్లాలో ఎండపల్లి, భీమారం కేంద్రాలుగా కొత్త మండలాలను ఏర్పాటు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పూరీ జగన్నాథ ఆలయ పేల్చివేతకు జ్యోతి మల్హోత్రా రెక్కీ?

కరాలి మూవీ పూజతో ప్రారంభించిన హీరో నవీన్ చంద్ర

థియేటర్లు బంద్ కు ఎగ్జిబిటర్లు పిలుపు - పర్సంటేజ్ లో తేడా తేల్చాలని నిర్మాతలు

ఏపీ సీఎం చంద్రబాబుకు బహుమతి ఇచ్చిన పూనమ్ కౌర్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments