Webdunia - Bharat's app for daily news and videos

Install App

తల్లిదండ్రులు పుస్తకాలు కొనివ్వలేదు.. 11 ఏళ్ల బాలుడు ఆత్మహత్య

Webdunia
బుధవారం, 11 అక్టోబరు 2023 (16:02 IST)
తల్లిదండ్రులు పుస్తకాలు కొనివ్వకపోవడంతో మనస్తాపానికి గురైన 11 ఏళ్ల బాలుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కొత్తగూడెం జిల్లాలోని బెండలపాడులో సుధీర్ బాబు తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
 
పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న బాలుడు పుస్తకాల కోసం తల్లిదండ్రుల నుంచి డబ్బులు డిమాండ్ చేశాడు. కానీ తల్లిదండ్రులు డబ్బులు ఇవ్వడానికి నిరాకరించడంతో మనస్తాపానికి గురయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి విచారణ చేపట్టారు. ఇదే జిల్లాలో జరిగిన మరో ఘటనలో డిగ్రీ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
 
అనారోగ్యంతో మనస్తాపానికి గురైన ఎస్.విజయ్ (19) తల్లాడ మండలం నారాయణపురం గ్రామంలోని తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విజయ్ డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థి. అనారోగ్యం కారణంగా తీవ్ర మనస్తాపానికి గురయ్యాడని పోలీసుల విచారణలో వెల్లడి అయ్యింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్‌‌కు ఏమైంది? ఆస్పత్రిలో వున్నాడా?

భయంగా వుంది, జీవితాంతం నువ్వు నా చేయి పట్టుకుంటావా?: రెండో పెళ్లికి సమంత రెడీ?

మహా కుంభమేళాలో కుటుంబంతో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్

ప్లాప్ తో సంభందం లేకుండా బిజీ గా సినిమాలు చేస్తున్న భాగ్యశ్రీ బోర్స్

ఇంటెన్స్ మ్యూజికల్ లవ్ స్టోరీగా హోలీ కి దిల్ రూబా తో వస్తున్నా : కిరణ్ అబ్బవరం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)

అధిక రక్తపోటును సింపుల్‌గా అదుపులోకి తెచ్చే పదార్థాలు

పిల్లలు వ్యాయామం చేయాలంటే.. ఈ చిట్కాలు పాటించండి

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

తర్వాతి కథనం
Show comments