Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిచ్చికుక్క‌ల‌ స్వైర‌విహారం, 10 మందికి తీవ్ర‌గాయాలు

Webdunia
గురువారం, 18 జూన్ 2020 (15:36 IST)
భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాలో పిచ్చికుక్క‌లు స్వైర‌విహారం చేశాయి. ఈ పిచ్చి కుక్కల దాడిలో 10 మందికి తీవ్ర‌ గాయాల‌య్యాయి. ఒక‌రి క‌నుగుడ్డు తొలిగిపోయింది. వివరాల్లోకి వెళితే.... భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా చుంచుప‌ల్లి మండ‌లం సింగ‌రేణి కార్మిక‌ ప్రాంత‌మైన‌ రుద్రంపూర్ తండాలో పిచ్చికుక్క‌ల‌ స్వైర‌ విహారంతో జ‌నం భ‌య‌కంపితుల‌య్యారు. 
 
దొరికిన‌ వారిని దొరికిన‌ట్లు దాడి చేశాయి. కండ‌ల‌ను కొరికాయి. వీర‌స్వామి అనే వ్య‌క్తి క‌నుగుడ్డు పీక‌టంతో యంజియంకు త‌ర‌లించారు. మిగ‌తావారికి తీవ్ర‌గాయాల‌య్యాయి. పిచ్చి కుక్క‌ల‌ స్వైర‌విహారంతో స్థానికులు హ‌డ‌లిపోయారు. స్థానికులు వెంబ‌డించి జ‌నంపై దాడి చేసిన‌ కుక్క‌ను చంపేసారు.
 
కుక్క‌ల స‌మ‌స్య‌ తీవ్రంగా ఉన్న‌ద‌ని, సింగ‌రేణి అధికారుల‌ ద‌ృష్టికి తీసుకెళ్ళినా స్పందించ‌లేద‌ని స‌ర్పంచ్ రామ‌స్వామి తెలిపారు. ఇప్ప‌టికైనా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు. కుక్క‌ల‌ బీభ‌త్సానికి జ‌నం భీతిల్లిపోయారు. అధికారులు స్పందించి బాధితులకు మెరుగైన‌ వైద్యం అందించాల‌ని స‌ర్పంచ్ రామ‌స్వామి కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments