తెలంగాణ రాష్ట్రంలో అదనంగా 1200 ప్రభుత్వ వైద్య సీట్లు

Webdunia
మంగళవారం, 16 ఆగస్టు 2022 (09:07 IST)
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 1200 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఇవన్నీ 2022-23 విద్యా సంవత్సరంలో అందుబాటులోకి వస్తాయి. ఆ దిశగా ప్రభుత్వం అన్ని రకాలుగా కృషి చేసింది. దీనికి కారణం ఈ విద్యా సంవత్సరం నుంచి ఎనిమిది కొత్త మెడికల్ కాలేజీలు ప్రారంభమయ్యేలా చర్యలు చేపట్టింది. త్వరలో నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసి) నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశం ఉంది. 
 
ఈ 8 కొత్త వైద్య కాలేజీల్లో జగిత్యాల, నాగర్‌కర్నూల్, సంగారెడ్డి, వనపర్తి జిల్లాల్లో నాలుగు కొత్త మెడికల్ కాలేజీలను ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించేందుకు ఎన్‌ఎంసి ఇప్పటికే అనుమతి ఇవ్వగా, మహబూబాబాద్, మంచిర్యాలు, కొత్తగూడెం, రామగుండంలో మిగిలిన నాలుగింటికి మరికొన్ని వారాల్లో అనుమతులు వచ్చే అవకాశం ఉందని ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు వెల్లడించారు. 
 
ప్రస్తుతం రాష్ట్రంలో 1700 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. ఇపుడు కొత్తగా మరో 1200 వైద్య సీట్లు అందుబాటులోకి రానున్నాయి. అలాగే, రాష్ట్రంలోని ప్రైవేటు వైద్య కాలేజీల్లో మరో 3500 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. వచ్చే విద్యా సంవత్సరంలో మరో ఎనిమిది వైద్య కాలేజీలు అందుబాటులోకి రానున్నాయి. వీటిని రూ.1479 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయనున్నారు. వీటిలో రాజన్న సిరిసిల్ల జిల్లా, వికారాబాద్, ఖమ్మం, కామారెడ్డి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, అసిఫాబాద్, జనగామ జిల్లాల్లో కొత్తగా వైద్య కాలేజీలు ఏర్పాటు చేయనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత రెండో భర్త రాజ్ నిడుమోరు నేపథ్యం ఏంటి?

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య చిత్రం ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్

Varun Sandesh: వ‌రుణ్ సందేశ్ న‌య‌నం ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

MB50: రజనీ కాంత్ సహా ప్రముఖుల సమక్షంలో ఘనంగా మోహన్ బాబు 50 వేడుకలు

బాలీవుడ్‌లో మిల్కీ బ్యూటీకి బంపర్ ఆఫర్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం