Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్తగూడెం: 319 కిలోల గంజాయి స్వాధీనం.. తల్లీకుమారుల అరెస్ట్

సెల్వి
మంగళవారం, 24 సెప్టెంబరు 2024 (22:29 IST)
కొత్తగూడెం ఎక్సైజ్ పోలీసులు 319 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలో వివిధ కేసులలో ఒక మహిళ, ఆమె కొడుకు సహా 10 మంది స్మగ్లర్లను అరెస్టు చేశారు. భద్రాచలం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ విబి కమలాసన్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. 
 
ఒడిశా సరిహద్దు నుంచి 100 కిలోల గంజాయిని అక్రమంగా తరలిస్తున్న కేసులో పెద్దపల్లి జిల్లా కొత్తపల్లికి చెందిన మహిళ నేరళ్ల అపర్ణ, ఆమె కుమారుడు ఎన్.అఖిల్ పట్టుబడ్డారు. అపర్ణ భర్త సదయ్య గంజాయి కేసులో అరెస్టయి జైలులో ఉన్నాడు.
 
పేరుమోసిన గంజాయి స్మగ్లర్లు, నిజామాబాద్‌కు చెందిన మునవర్ అలీ, హైదరాబాద్‌లోని బేగంబజార్‌కు చెందిన దత్తు పంచల్‌లతో పాటు హైదరాబాద్‌లోని బాలా నగర్‌కు చెందిన శక్తి రాహుల్, గోపిశెట్టి అక్షిత్‌లను కూడా అరెస్టు చేశారు. ఇలా పట్టుబడిన గంజాయి విలువ రూ.79.75 లక్షలు. అంతేగాకుంజా 21 లక్షల విలువైన రెండు కార్లు, రెండు ద్విచక్ర వాహనాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటనలో తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మలయాళ మార్కో దర్శకుడు హనీఫ్ అదేనితో దిల్ రాజు చిత్రం

CPI Narayana: కాసుల కోసం కక్కుర్తి పడకండి - సినీ పరిశ్రమకి సిపిఐ నారాయణ ఘాటు విమర్శ

Samantha: ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న సమంత

Nitin: అల్లు అర్జున్ జులాయ్ చూసినవారికి నితిన్ రాబిన్ హుడ్ నచ్చుతుందా?

కీర్తి సురేష్‌ను ఆటపట్టించిన ఐస్‌క్రీమ్ వెండర్... ఫన్నీగా కౌంటరిచ్చిన హీరోయిన్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments