Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో యూపీఏ సేవలకు ఎండ్ కార్డ్ పడనుందా?

సెల్వి
మంగళవారం, 24 సెప్టెంబరు 2024 (21:39 IST)
భారత్‌లో యూపీఏ సేవలకు ఎండ్ కార్డ్ పడనుందా అంటే సర్వేలు అవుననే చెప్తున్నాయి. యూపీఏ వినియోగదారులపై ఇటీవలి సర్వేలో ఈ విషయం వెల్లడి అయ్యింది. లోకల్‌ సర్కిల్స్ నిర్వహించిన తాజా సర్వేలో భారతదేశంలో యూపీఏ చెల్లింపుల భవిష్యత్తుకు సంబంధించి చాలా ఆసక్తికరమైన ఫలితాలను వెల్లడి అయ్యాయి. 
 
యూపీఏ లావాదేవీలపై రుసుము విధిస్తే దేశంలో ఈ సేవలను భారతీయులు కొనసాగించడం కష్టమేనని తెలిసింది. యూపీఏ లావాదేవీలపై రుసుము విధిస్తే కనుక ఆ సేవలకు బైబై చెప్పేస్తామని అత్యధికంగా 75 శాతం మంది వినియోగదారులు ఓటేశారు. 
 
రుసుము విధిస్తే.. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి యాప్‌లను ఉపయోగించడాన్ని ఆపివేస్తామని స్పష్టం చేశారు. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, 22% మంది వినియోగదారులు తమపై విధించే కొన్ని రకాల లావాదేవీల రుసుములకు అనుకూలంగా ఓటు వేశారు. 
 
308 జిల్లాల్లో ఈ సర్వే జరిగింది. ప్రస్తుతానికి, భారతదేశంలో మొత్తం UPI లావాదేవీలు 100 బిలియన్ల మార్కును అధిగమించాయి. ఈ సర్వే వివరణాత్మక ఫలితాలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), ఆర్థిక మంత్రిత్వ శాఖకు అందించబడతాయి. 
 
ఇది ప్రజల మానసిక స్థితిని అంచనా వేయడంలో ప్రభుత్వానికి సహాయపడుతుంది. భవిష్యత్తులో యూపీఐకి ఎలాంటి లావాదేవీల రుసుములను జోడించకూడదనే ప్రజాభిప్రాయం వైపు ప్రభుత్వాన్ని నడిపిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments