Webdunia - Bharat's app for daily news and videos

Install App

పానీపూరీ తిన్న అన్నదమ్ములు మృతి.. ఎక్కడో తెలుసా?

సెల్వి
గురువారం, 25 జనవరి 2024 (18:49 IST)
పానీపూరీ తిన్న ఇద్దరు అన్నదమ్ములు అస్వస్థతకు గురై మృత్యువాత పడ్డారు. వివరాల్లోకి వెళితే.. 
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో విషాదం చోటుచేసుకుంది. గ‌త‌ రాత్రి పానీపూరీ తిని కడుపునొప్పితో బాధపడుతున్న ఇద్దరు చిన్నారులను కుటుంబసభ్యులు ప్రైవేట్ ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలోనే మృతి చెందారు. 
 
చనిపోయిన ఇద్దరు అన్నదమ్ములు వెలపాటి రామకృష్ణ (10), వెలపాటి విజయ్ (6) జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
 
పానీపూరీ తినడం వల్లే ఫుడ్ పాయిజన్ అయ్యి తమ బిడ్డలు చనిపోయారని మృతుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
 
నంద్యాల జిల్లా వైఎస్సార్‌ కాలనీ నుంచి బ్రతుకుతెరువు కోసం ప్లాస్టిక్ వ్యాపారం చేసేందుకు జంగారెడ్డిగూడెంకు వెలపాటి కుటుంబం వలస వచ్చింది. ఊహించని రీతిలో ఇద్దరు పిల్లలు మృత్యువాతపడటంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తర్వాతి కథనం
Show comments