Webdunia - Bharat's app for daily news and videos

Install App

మేడారం జాతర కోసం ఆరువేల బస్సులు.. మంత్రులు సమీక్ష

సెల్వి
మంగళవారం, 6 ఫిబ్రవరి 2024 (11:57 IST)
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్సార్టీసీ) ఫిబ్రవరి 18 నుండి 25 వరకు జరగనున్న మేడారం జాతర కోసం సుమారు 6,000 బస్సులను నడుపుతుంది. ఈ బస్సులు తెలంగాణ వ్యాప్తంగా 51 పాయింట్ల నుండి నడపబడతాయి. 
 
ములుగు జిల్లాలో ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు జాతర జరగనుండగా, ఈ కార్యక్రమంలో లక్షలాది మంది సందర్శకులు పాల్గొంటారు. ఈ ఏడాది 30 లక్షల మంది ప్రయాణికులు తమ ప్రత్యేక బస్సులను ఉపయోగిస్తారని టీఎస్‌ఆర్‌టీసీ అంచనా వేస్తోంది. 
 
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర సందర్భంగా టీఎస్‌ఆర్టీసీ ఆధ్వర్యంలో జరుగుతున్న పనులను సోమవారం మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క టీఎస్‌ఆర్టీసీ అధికారులతో కలిసి పరిశీలించారు. 
 
తాడ్వాయిలో టిక్కెట్‌ జారీ చేసే కౌంటర్లను తనిఖీ చేశారు. అనంతరం టిఎస్‌ఆర్‌టిసి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మేడారం జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ అధికారులను ఆదేశించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

SS Rajamouli: మహేష్ బాబు సినిమాకు సంగీతం ఒత్తిడి పెంచుతుందన్న కీరవాణి

మలయాళ మార్కో దర్శకుడు హనీఫ్ అదేనితో దిల్ రాజు చిత్రం

CPI Narayana: కాసుల కోసం కక్కుర్తి పడకండి - సినీ పరిశ్రమకి సిపిఐ నారాయణ ఘాటు విమర్శ

Samantha: ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న సమంత

Nitin: అల్లు అర్జున్ జులాయ్ చూసినవారికి నితిన్ రాబిన్ హుడ్ నచ్చుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments