Webdunia - Bharat's app for daily news and videos

Install App

వారం వారం రూ.200 చెల్లించలేక దంపతుల ఆత్మహత్య!!

ఠాగూర్
బుధవారం, 1 జనవరి 2025 (10:20 IST)
తీసుకున్న అప్పును తిరిగి చెల్లించే క్రమంలో వారం వారం రూ.200 చెల్లించలేక ఓ దంపతుల జంట ఆత్మహత్య చేసుకుంది. దీంతో వారి ఇద్దరు పిల్లలు ఇపుడు అనాథలుగా మిగిలిపోయారు. ఈ విషాదకర ఘటన తెలంగాణ రాష్ట్రంలోని భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలం కమలాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఈ గ్రామానికి చెందిన బానోత్ దేవేందర్ (37), చందన (32) భార్యాభర్తలు. వీరికి రిషి (14), జశ్వంత్ (12) అనే ఇద్దరు అబ్బాయిలున్నారు. దేవేందర్, చందన ఇద్దరూ వ్యవసాయ కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు.
 
ఈ క్రమంలో గ్రామంలోని మహిళలు ఓ గ్రూపుగా ఏర్పడి ఓ ప్రైవేటు ఫైనాన్స్ వ్యాపారి వద్ద రూ.2.50 లక్షల అప్పు తీసుకున్నారు. దీనికి చందన వంతుగా ప్రతి వారం రూ.200 చెల్లించాలి. కొన్నాళ్లపాటు క్రమం తప్పకుండా చెల్లించినా ఇటీవల భర్త, పిల్లలు అనారోగ్యం బారినపడడంతో కిస్తీలు కట్టడంలో ఇబ్బంది ఏర్పడింది. దీంతో ఫైనాన్స్ వ్యాపారి నుంచి ఒత్తిడి పెరిగింది.
 
ఈ క్రమంలో మనస్తాపానికి గురైన చందన డిసెంబరు 6వ తేదీన గడ్డిమందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన ఇరుగుపొరుగు వారు వెంటనే ఆమెను వరంగల్ ఎంజీఎంకు తరలించారు. చికిత్స పొందుతున్న భార్య పరిస్థితిపై ఆందోళనతో దేవేందర్ అదే నెల 20వ తేదీన ఇంట్లో ఉరివేసుకున్నాడు. కాగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చందన మంగళవారం తుదిశ్వాస విడిచింది. తల్లిదండ్రుల మృతితో చిన్నారులు అనాథలుగా మారారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments