సోషల్ మీడియాలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పోస్ట్ చేసిన ఓ ఫోటోలో సీఎం జగన్ మోహన్ రెడ్డి పోలినట్లు ఓ యువకుడు కనిపించాడు. ఇంతకీ ఆ పోస్ట్లో వున్నది ఎవరు, ఏంటా సంగతి, తెలుసుకుందాం. వైఎస్ షర్మిల తన కుమారుడు రాజారెడ్డి పెండ్లి పిలుపు కోసం ప్రముఖులను కలుస్తున్నారు. ఇందులో భాగంగా ఈరోజు తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇంటికి వెళ్లి స్వయంగా ఆహ్వానించారు. ఆ సమయంలో పక్కనే భట్టి కుమారుడు కూడా వున్నారు.